Rajendranagar : మహిళ కిడ్నాప్ నుంచి హత్య వరకు షాకింగ్ ట్విస్ట్
- రాజేంద్రనగర్ మహిళ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో పురోగతి
- మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లు
- అత్తాపూర్లో అపస్మారకస్థితిలో ఉన్న మహిళను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి
- కిస్మత్పురలోని నిర్మానుశ్యప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై దుర్గారెడ్డి అత్యాచారం
- అత్యాచారం తర్వాత మహిళను అత్తాపూర్కు తీసుకొచ్చి వదిలేసిన దుర్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendranagar : హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. 30 సంవత్సరాల మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసి, చివరకు హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో హైదరాబాద్ నగరంలో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు అత్తాపూర్లో అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ దుర్గారెడ్డి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను కిస్మత్పురలోని ఒక నిర్మాణస్య ప్రదేశానికి తీసుకెళ్లి రేప్కు పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ మరింత అపస్మారక స్థితిలోకి వెళ్లేలా మత్తుమందు కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Vidrohi : ఆసక్తికరంగా ‘విద్రోహి’ ట్రైలర్
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
రేప్ చేసిన అనంతరం మహిళను తిరిగి అత్తాపూర్ ప్రాంతానికి తీసుకొచ్చి పిల్లర్ నెంబర్ 340 వద్ద వదిలేసి దుర్గారెడ్డి వెళ్లిపోయాడు. దుర్గారెడ్డి వెళ్లిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడ చూసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు దస్తగిరి, ఇమ్రాన్ కిడ్నాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకుని మళ్లీ కిస్మత్పురలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్రేప్ చేశారు.
ఈ సమయంలో మహిళ సహకరించలేదన్న కారణంతో ఇమ్రాన్, దస్తగిరి ఆమెను కొట్టి హత్య చేశారు. అనంతరం ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమె వంటిపైన ఉన్న దుస్తులను తొలగించారు. మృతురాలు పాత బస్తీకి చెందిన 30 ఏళ్ల మహిళ అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దుర్గారెడ్డి, దస్తగిరి, ఇమ్రాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపి, సాక్ష్యాధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..