Drugs : ట్యూషన్ క్లాసుల వెనక దాగిన మత్తు రహస్యం.!
- బోయిన్పల్లిలో ఈగల్ టీం భారీ ఆపరేషన్
- స్కూల్ ముసుగులో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ బహిర్గతం
- ఆల్ఫా జోలం పెద్ద ఎత్తున స్వాధీనం, నలుగురు అరెస్ట్
- ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడుకు సరఫరా నెట్వర్క్పై దర్యాప్తు
Drugs : సికింద్రాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయిన్పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఆపరేషన్లో పోలీసులు షాకింగ్ వివరాలను బయటపెట్టారు. బోయిన్పల్లిలోని మేధా హై స్కూల్ను మూసివేసి, దాని లోపలే డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గౌడ్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి. అతను స్కూల్ను మూసివేసి, పగటి పూటల్లో డ్రగ్స్ తయారీ చేయగా, సాయంత్రం మాత్రం ట్యూషన్ తరగతులు నడిపేవాడట. ఈ విధంగా ఎవరికి అనుమానం రాకుండా అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్లు దర్యాప్తులో తెలిసింది.
ప్రమాదకరమైన ఆల్ఫా జోలం అనే మత్తుమందును స్కూల్లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మత్తుమందును నగరంలోని కల్లు కాంపౌండ్లకు, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. స్కూల్లోని మూడు అంతస్తుల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నాలుగు రియాక్టర్ల సహాయంతో ఆల్ఫా జోలం తయారీ కొనసాగించారని అధికారులు తెలిపారు. ఇప్పటికే అక్కడి నుంచి 20 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
సమాచారం అందుకున్న ఈగల్ టీం ముందుగా గౌడ్ దగ్గర రెడ్ హ్యాండెడ్గా 5 కిలోల ఆల్ఫా జోలం మత్తుమందు స్వాధీనం చేసింది. అనంతరం స్కూల్ లోపల నిర్వహించిన సోదాల్లో మరో 5 కిలోల ఆల్ఫా జోలం, నాలుగు రియాక్టర్లు, పలు రసాయనాలు, నగదు, తయారీకి సంబంధించిన పరికరాలు దొరికాయి.
అదే సమయంలో ఆల్ఫా జోలం తయారీలో పాల్గొంటున్న నలుగురు కార్మికులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని గౌడ్ స్కూల్ లోపలే ఉంచి డ్రగ్స్ తయారీలో ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బోయిన్పల్లి పరిసరాల్లో కలకలం రేగింది. స్కూల్ ముసుగులో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ జరగడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కేసులో గౌడ్తో పాటు మరికొందరు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ఎంతవరకు విస్తరించిందో, ఎవరు ఇందులో భాగస్వాములయ్యారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసిన ఆల్ఫా జోలం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఆపరేషన్తో సికింద్రాబాద్ డ్రగ్ మాఫియాకు గట్టి దెబ్బ తగిలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!