Murder : మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు.. చివరికి
- దొంగ తెలివి తేటలు శ్రుతి మించుతున్నాయి
- మామ అయ్యే కట్రోత్ శివయ్య ఆస్తిపై కన్నేశారు
- మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు
- చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. హైదరాబాద్లో తాజాగా జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. సైదాబాద్ విష్ణునగర్లో వృద్ధుడిని చంపేసిన కోడలు.. దోపిడీ దొంగల ప్రయత్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె తెలివితేటలకు చెక్ పెట్టారు. ఆమెతోపాటు సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు నినవత్ మంగ. పక్కనే ఉన్నది ఆమె ప్రియుడు వెంకట్. ఈ ఇద్దరు కలిసి దారుణమైన స్కెచ్ వేశారు. నినవత్ మంగకు వరుసకు మామ అయ్యే వృద్దుడు కట్రోత్ శివయ్య ఆస్తిపై కన్నేశారు. ఆయన్ను చంపేస్తే ఆస్తి తమకే వస్తుందని.. మంగ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది..
సైదాబాద్.. విష్ణునగర్లో కట్రోత్ శివయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. సెప్టెంబర్ 14న రాత్రి సమయంలో.. శివయ్య ఉంటున్న ఇంటికి మంగ.. తన ప్రియుడు వెంకట్తోపాటు కొడుకు భరత్ను తీసుకుని వెళ్లింది. నిద్రపోతున్న శివయ్యను.. దిండుతో ఊపిరి ఆడకుండా చేశారు. తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఎత్తుకుని వెళ్లిపోయారు. అంతే కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు శివయ్య గొంతు కోసి.. డెడ్ బాడీని ఇంటి ముందు పడేశారు..
Also Read
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
ఉదయం.. ఏమీ తెలియనట్లుగా వచ్చిన మంగ..కొత్త డ్రామా షురూ చేసింది. అర్ధరాత్రి దొంగలు పడి తన మామను చంపేశారని.. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారని నాటకం మొదలు పెట్టింది. ఈ మేరకు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు షురూ చేశారు. ఈ కేసులో సీసీ ఫుటేజీల పరిశీలనతోపాటు అన్ని కోణాల్లో విచారణ చేశారు. బంధువులను విచారించారు. ఐతే పోలీసులకు.. మంగ ఓవరాక్షన్ చూసి అనుమానం వచ్చింది. దీంతో ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఆస్తి కోసం తామే హత్య చేసినట్లు వెల్లడించింది. తనకు కొడుకు భరత్తోపాటు వెంకట్ అనే వ్యక్తి మరో నలుగురు సాయం చేశారని వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట్ అనే వ్యక్తి మంగ ప్రియుడిగా విచారణలో తేలింది..
ఐతే మంగ చాలా కాలం నుంచి వృద్ధుడు శివయ్యకు సంబంధిచిన ఇంటిపై కన్నేసింది. తన పేరిట రాసి ఇవ్వాలని కూడా అడిగింది. ఐతే శివయ్య అందుకు నిరాకరించాడు. తన ఇంటిని ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. నిన్న చంపి అయినా ఇల్లు, ఆస్తి తీసుకుంటానని మంగ.. మంగమ్మ శపథం చేసింది. చివరకు అన్నట్లుగా అతన్ని ఆస్తి కోసం చంపేసింది. ఆస్తి కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మంగను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!