Murder : మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు.. చివరికి
- దొంగ తెలివి తేటలు శ్రుతి మించుతున్నాయి
- మామ అయ్యే కట్రోత్ శివయ్య ఆస్తిపై కన్నేశారు
- మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు
- చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. హైదరాబాద్లో తాజాగా జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. సైదాబాద్ విష్ణునగర్లో వృద్ధుడిని చంపేసిన కోడలు.. దోపిడీ దొంగల ప్రయత్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె తెలివితేటలకు చెక్ పెట్టారు. ఆమెతోపాటు సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు నినవత్ మంగ. పక్కనే ఉన్నది ఆమె ప్రియుడు వెంకట్. ఈ ఇద్దరు కలిసి దారుణమైన స్కెచ్ వేశారు. నినవత్ మంగకు వరుసకు మామ అయ్యే వృద్దుడు కట్రోత్ శివయ్య ఆస్తిపై కన్నేశారు. ఆయన్ను చంపేస్తే ఆస్తి తమకే వస్తుందని.. మంగ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది..
సైదాబాద్.. విష్ణునగర్లో కట్రోత్ శివయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. సెప్టెంబర్ 14న రాత్రి సమయంలో.. శివయ్య ఉంటున్న ఇంటికి మంగ.. తన ప్రియుడు వెంకట్తోపాటు కొడుకు భరత్ను తీసుకుని వెళ్లింది. నిద్రపోతున్న శివయ్యను.. దిండుతో ఊపిరి ఆడకుండా చేశారు. తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఎత్తుకుని వెళ్లిపోయారు. అంతే కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు శివయ్య గొంతు కోసి.. డెడ్ బాడీని ఇంటి ముందు పడేశారు..
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
ఉదయం.. ఏమీ తెలియనట్లుగా వచ్చిన మంగ..కొత్త డ్రామా షురూ చేసింది. అర్ధరాత్రి దొంగలు పడి తన మామను చంపేశారని.. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారని నాటకం మొదలు పెట్టింది. ఈ మేరకు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు షురూ చేశారు. ఈ కేసులో సీసీ ఫుటేజీల పరిశీలనతోపాటు అన్ని కోణాల్లో విచారణ చేశారు. బంధువులను విచారించారు. ఐతే పోలీసులకు.. మంగ ఓవరాక్షన్ చూసి అనుమానం వచ్చింది. దీంతో ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఆస్తి కోసం తామే హత్య చేసినట్లు వెల్లడించింది. తనకు కొడుకు భరత్తోపాటు వెంకట్ అనే వ్యక్తి మరో నలుగురు సాయం చేశారని వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట్ అనే వ్యక్తి మంగ ప్రియుడిగా విచారణలో తేలింది..
ఐతే మంగ చాలా కాలం నుంచి వృద్ధుడు శివయ్యకు సంబంధిచిన ఇంటిపై కన్నేసింది. తన పేరిట రాసి ఇవ్వాలని కూడా అడిగింది. ఐతే శివయ్య అందుకు నిరాకరించాడు. తన ఇంటిని ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. నిన్న చంపి అయినా ఇల్లు, ఆస్తి తీసుకుంటానని మంగ.. మంగమ్మ శపథం చేసింది. చివరకు అన్నట్లుగా అతన్ని ఆస్తి కోసం చంపేసింది. ఆస్తి కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మంగను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!