CM Rvanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో కేబినెట్ విస్తరణ గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో బిజీగా ఉండడంతో కేబినెట్ విస్తరణ అంశం కొంతకాలం వెనక్కి పోయింది. అయితే, ఈ సమయంలో ఎవరైనా కేబినెట్ విస్తరణలో చోటు పొందేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ, ఈ విషయంపై ఇటీవల తాజా పర్యవేక్షణలు జోరుగా సాగుతున్నాయి.…
Accident : పెద్దఅంబర్ పేట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రిత్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో రిత్విక LKG చదువుతోంది. అయితే.. రోజులాగే ఈ రోజు కూడా బాలిక బస్సు దిగింది. అయితే.. బాలిక దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ చేయడం ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె మరణ వార్తతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి…
Fire Accident : హైదరాబాద్లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫేస్-1 ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. కెమికల్ ఫ్యాక్టరీలో రసాయనాల వల్ల మంటలు మిన్నంటడంతో వాటి ప్రభావం చుట్టుపక్కల పరిశ్రమలకు విస్తరించింది. సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీలో మొదలైన మంటలు సమీపంలోని ఇతర పరిశ్రమలకు వ్యాపించాయి. ముఖ్యంగా పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో పరిస్థితి మరింత…
MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…
Fraud : క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్ పారిపోదామనుకున్న రమేష్ గౌడ్ వ్యవహారం మరో విషయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి కరీంనగర్ వరంగల్ జిల్లాలో 100 కోట్లు వసూలు చేశాడు రమేష్. రమేష్ ని కాపాడేందుకు సీఐడీ అధికారుల ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్లో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. నిందితుడైన రమేష్ తో…
Road Accident: నార్సింగ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోగా, మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ప్రమాద సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ఖానాపూర్ వద్ద డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో జస్మిత్ అనే యువ వైద్యుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. భూమిక అనే మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఇద్దరు వైద్యులు జన్వాడలో జరిగిన ఓ ఫంక్షన్…
Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. షన్ ఘనపురం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన జరుగుతుందన్నారు. పాతరోజులను తలపించే విధంగా కడియం శ్రీహరి మల్లీ అరాచకపు పాలన కొనసాగిస్తున్నాడని, ఆరు నెలల్లో ఆరుగురిపై అక్రమ కేసులు పెట్టించాడన్నారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచి ఊసరవెల్లి లాగ పార్టీ…
GHMC Council : జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాభాసగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, దీనికి బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్పై కాకుండా, ప్రజా సమస్యలపై మొదట చర్చించాలనే డిమాండ్తో ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు…
Non Veg : మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్బంగా రేపు (జనవరి 30) హైదరాబాద్ నగరంలో అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మేక, గొర్రెల మండిలు, మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నాయి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. మాంసం దుకాణాలు…
Meerpet Murder Case : తెలంగాణను కుదిపేసిన మీర్పేట్ హత్య కేసును పోలీసులు పరిష్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. సీపీ సుధీర్బాబు మాట్లాడుతూ, భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ, నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతుండగా,…