TGSRTC : ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
- తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ
- బెంగళూరు మార్గానికి ప్రత్యేక రాయితీ
- ఇతర మార్గాల్లో రాయితీపై డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ రాయితీ అన్ని మార్గాలకు వర్తించదని, ప్రత్యేకంగా బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే “మహాలక్ష్మి పథకం” అమలులో ఉంది. దీని కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణ సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మహిళ ఉచిత ప్రయాణ పథకం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోందని వెల్లడించారు.
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
ఇప్పుడు, ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో 10% రాయితీని ప్రవేశపెట్టింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు https://tgsrtcbus.in వెబ్సైట్ను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
Pradeep : జూనియర్ ధనుష్ మరోసారి వంద కోట్ల క్లబ్ లో చేరతాడా..?
బెంగళూరు దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అక్కడ తెలంగాణకు చెందిన వేలాది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు స్థిరపడిపోయి ఉంటారు. వారిలో చాలామంది తరచుగా హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాలు సెలవుల కారణంగా ప్రయాణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ఈ రాయితీ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ప్రస్తుతం ఈ ప్రత్యేక రాయితీ హైదరాబాద్-బెంగళూరు మార్గానికే పరిమితంగా ఉన్నప్పటికీ, ఇతర ముఖ్యమైన మార్గాల్లోనూ దీన్ని అమలు చేయాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ వి.సి. సజ్జనార్ ఈ రాయితీ ప్రకటనను ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ప్రకటించగా, అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ రాయితీ ప్రయోజనాన్ని ప్రయాణికులు వినియోగించుకుని ప్రయాణ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
Earthquake : ప్రతిరోజూ 1000భూకంపాలు… ప్రపంచంలోని ఈ ప్రాంతం ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది ?
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!