TGSRTC : ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
- తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ
- బెంగళూరు మార్గానికి ప్రత్యేక రాయితీ
- ఇతర మార్గాల్లో రాయితీపై డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ రాయితీ అన్ని మార్గాలకు వర్తించదని, ప్రత్యేకంగా బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే “మహాలక్ష్మి పథకం” అమలులో ఉంది. దీని కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణ సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మహిళ ఉచిత ప్రయాణ పథకం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోందని వెల్లడించారు.
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
ఇప్పుడు, ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో 10% రాయితీని ప్రవేశపెట్టింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు https://tgsrtcbus.in వెబ్సైట్ను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
Pradeep : జూనియర్ ధనుష్ మరోసారి వంద కోట్ల క్లబ్ లో చేరతాడా..?
బెంగళూరు దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి. అక్కడ తెలంగాణకు చెందిన వేలాది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు స్థిరపడిపోయి ఉంటారు. వారిలో చాలామంది తరచుగా హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాలు సెలవుల కారణంగా ప్రయాణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ఈ రాయితీ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ప్రస్తుతం ఈ ప్రత్యేక రాయితీ హైదరాబాద్-బెంగళూరు మార్గానికే పరిమితంగా ఉన్నప్పటికీ, ఇతర ముఖ్యమైన మార్గాల్లోనూ దీన్ని అమలు చేయాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ వి.సి. సజ్జనార్ ఈ రాయితీ ప్రకటనను ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ప్రకటించగా, అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ రాయితీ ప్రయోజనాన్ని ప్రయాణికులు వినియోగించుకుని ప్రయాణ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
Earthquake : ప్రతిరోజూ 1000భూకంపాలు… ప్రపంచంలోని ఈ ప్రాంతం ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది ?
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!