Home
Telangana News
Telangana News News
-
Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
ప్రతి ఒక గ్రూపుకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రతి ఒక మహిళా సంఘం తీసుకుని 10 లక్షల రూపాయల బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళా సంఘాల రుణాలకు ఈ ఏడాది వడ్డీల కోసం 2500 కోట్లు ఖర్చు చేస్తామని సీతక్క వెల్లడించారు. మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో మా ప్రభుత్వం… -
Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
Tragedy : సంగారెడ్డి జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జిల్లాలోని కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తల్లి, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బట్టలు ఉతకడానికి సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒకరు బావిలో పడిపోగా, వారిని రక్షించే… -
Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో చోటుచేసుకున్న కాల్పుల కలకలంపై పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నగల దుకాణంలో సాహసోపేతంగా చోరీకి పాల్పడి, కాల్పులతో భీభత్సం సృష్టించిన నిందితులను పట్టుకోవడంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ కేసులో పురోగతి సాధించే క్రమంలో పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేరంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురు నిందితుల ఫోటోలను అధికారికంగా విడుదల చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నందున, వారిని గుర్తించేందుకు ప్రజల సహకారం… -
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
DGP CV Anand : తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతి , మావోయిస్టుల పునరావాస చర్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో వేగం పెంచడమే కాకుండా, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ… -
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తుల కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో, ప్రమాదవశాత్తు అందులో పడి మోక్షిత అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో, సుమారు 20 రోజుల… -
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
Kalvakuntla Kavitha New Party: కల్వకుంట్ల కవిత ఇటీవల కొత్త పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత సోషల్ మీడియా ప్లాట్పామ్లో ఓ ప్రకటన విడుదల చేసింది. "తెలంగాణ రక్షణ సేన (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ,… -
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
IFS Transfers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలో కీలక మార్పులు చేస్తూ పెద్ద ఎత్తున బదిలీల ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 12 మంది ఐఎఫ్ఎస్ (IFS) , నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ, వారికి కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరిట జీవో విడుదలయ్యింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీలలో భాగంగా ఎస్. రమేష్ను హైదరాబాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్గా నియమించగా, ములుగులోని ఫారెస్ట్… -
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, తానూ అడగలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని అడుగుతున్నామన్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నామన్నారు. ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని చెప్పారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఉద్యమ స్పూర్తితో ముందుకు పోయామన్నారు. ఎన్నికలు,… -
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
Crane Accident : హైదరాబాద్ నగర శివార్లలోని శంకర్ పల్లి పరిధిలో ఉన్న ఎన్సీసీ (NCC) కన్స్ట్రక్షన్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణ రంగ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు పది మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఈదురు… -
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
Fire Accident : హైదరాబాద్ లోని అంబర్పేట నెంబర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మహీంద్రా , రెనాల్ట్ కార్ల షోరూంలకు చెందిన స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. గోదాంలో ఉన్న పాత స్పేర్ పార్ట్స్, టైర్లు, లెదర్ సీట్లు అంటుకోవడంతో ఆకాశమంతా నల్లటి దట్టమైన పొగ కమ్ముకుంది. కార్ సర్వీసింగ్ సెంటర్లలో మార్చిన పాత వస్తువులను భద్రపరిచే గోదాంలో ఈ ప్రమాదం జరిగింది.…
తాజావార్తలు
-
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
-
Kedar Jadhav: సచిన్తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
-
Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..
-
Kriti-Rashmika: రష్మిక గురించి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!