CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి KPHB కాలనీలో ప్రసంగిస్తూ ఇళ్ల నిర్మాణం, భూక్రమబద్ధీకరణపై ప్రజలకు హామీ ఇచ్చారు. భూమికి సంబంధించిన డబ్బులు ఏమీ తీసుకోవడం లేదని, ఇల్లు పూర్తయిన తర్వాత మాత్రమే రూ. 5 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. 22A నిబంధనల కింద ఉన్న భూములకు తనదే పూర్తి భరోసా అని, కోర్టు కేసులు ఉన్నవి మినహా మిగిలిన భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కూకట్పల్లిని ప్రత్యేకంగా చూసి అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా తనను ఎంపీగా గెలిపించిన కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే హౌసింగ్ బోర్డు కాలనీలు నిర్మితమయ్యాయని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను తీవ్రంగా విమర్శించిన ఆయన.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఊరవతల ఇళ్లు కట్టి ప్రజలను ఉపాధికి దూరం చేశారని ధ్వజమెత్తారు. పదేళ్ల కేసీఆర్ పాలనకు, తమ ప్రభుత్వం పూర్తి చేసిన పనులకు మధ్య ఉన్న తేడాను ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
గత ప్రభుత్వం చేసిన అప్పులకు గానూ తమ ప్రభుత్వం నెలకు రూ. 7 వేల కోట్లు వడ్డీలు కడుతోందని వెల్లడించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరలు, సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు పాలనా సేవలు ఇబ్బంది లేకుండా GHMCని మూడు భాగాలుగా విభజించామని చెప్పారు. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా ఎదుర్కొంటానని, ప్రజలు అండగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్ఫేక్లపై శృతి హాసన్కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!