తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు పండగ వేళ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ డియర్నెస్ అలవెన్స్ (DA) , డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపుదలపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన G.O.Ms.No. 2 (ఉద్యోగులకు) , G.O.Ms.No. 3 (పెన్షనర్లకు) ప్రకారం, జూలై 1, 2023 నుండి అమల్లోకి వచ్చేలా ఈ అలవెన్స్లను సవరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా, పెరిగిన ఈ డీఏ , డీఆర్ వల్ల…
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి సంబంధించి వినిపిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే, ఈ సమావేశం నిర్వహణ వేదిక విషయంలో ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సచివాలయంలో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశాన్ని, ఈసారి ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.…
తెలంగాణ రాష్ట్ర ప్రగతి చక్రం పదిన్నర లక్షల మంది ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు చేసే అసలైన సారథులు ఉద్యోగులేనని స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు మారినంత మాత్రాన వ్యవస్థ మారదని, గత ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఉద్యోగుల చేత తప్పుడు నిర్ణయాలు అమలు చేయించిందని ఆయన ఆరోపించారు. అయితే తమ…
Sankranti Buses : సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని నిబంధనలను అతిక్రమిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పట్ల తెలంగాణ రవాణా శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. జనవరి 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను ప్రారంభించిన అధికారులు, ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 75 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను విస్మరించి బస్సుల్లో భారీగా సరుకు రవాణా చేయడం, ప్రయాణిస్తున్న వారి…
గ్రోక్ లో మహిళల అభ్యంతరకరమైన కంటెంట్ పై కేంద్రం సీరియస్.. ఎక్స్ కి నోటీసులు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో నెటిజన్స్ గ్రోక్ ను ట్యాగ్ చేస్తూ మహిళలపై అసభ్యకరమైన చిత్రాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. బికినీలో, డ్రెస్ రిమూవ్ అంటూ గ్రోక్ ను ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై గ్రోక్ లో మహిళల అభ్యంతరకరమైన కంటెంట్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X కి నోటీసులు…
Jangaon : జనగామ జిల్లాలో ఒక సామాన్య రైతు పడుతున్న కష్టాలు, అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. తన పొలం ఎండిపోతుంటే తట్టుకోలేక, ఒక రైతు ఏకంగా జిల్లా కలెక్టర్ కాళ్లు మొక్కి తన సమస్యను పరిష్కరించాలని వేడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోని ఒక గ్రోమోర్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న యూరియా రికార్డులను , నిల్వలను తనిఖీ…
Fire Accident : నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సోమాజిగూడ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఆల్ పైన్ హైట్స్ (Alpine Heights) అపార్ట్మెంట్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం కావడంతో అపార్ట్మెంట్లోని నివాసితులంతా ఇళ్లలోనే ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఐదో అంతస్తులో ఉన్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. పొగ దట్టంగా…
Fire Accident : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓమ్నీ వ్యాన్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంటలు వ్యాపించిన సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కిందకు దిగి పరుగులు తీయడంతో పెను ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్ బంకులోకి మంటల వాహనం ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ ఘట్కేసర్…
Child Trafficking : సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టిన రోజు కూడా నిండని పసికందులను తీసుకువచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి…