Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
- తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల ప్రకటన
- ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
- గ్రేహౌండ్స్ సిబ్బందికి శౌర్య పతకాలు
- వివిధ విభాగాల అధికారులకు ప్రశంసనీయ సేవా పతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Medals : భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు అధికారులు , సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పతకాలతో గౌరవించింది. విధుల్లో చూపిన అసమాన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు , నిబద్ధతకు గుర్తింపుగా ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం’ (PPMDS), ‘శౌర్య పతకం’ (PMG) , ‘ప్రశంసనీయ సేవా పతకాలను’ (PMMS) ప్రకటించింది. ప్రజాసేవలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ పురస్కారాలు లభించాయి.
విశిష్ట సేవా పతకాలు , శౌర్య పురస్కారాల గ్రహీతలు
అత్యున్నతమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి (President’s Medal for Distinguished Service)గాను హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య జోగుల ఎంపికయ్యారు. అలాగే ప్రాణాలకు తెగించి పోరాడే వీరోచిత ప్రతిభ కనబరిచినందుకు గాను గ్రేహౌండ్స్ రంగానికి చెందిన బి. సత్యరావు (పిసి), కె. సందీప్ కుమార్ (పిసి), జె. వంశీకృష్ణ (పిసి)లు అత్యంత ప్రతిష్టాత్మకమైన శౌర్య పతకాలను (Medal for Gallantry) దక్కించుకున్నారు.
Also Read
- Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
- Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
- Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..
ప్రశంసనీయ సేవా పతకాల (మరిటోరియస్ సర్వీస్) విజేతలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి. వీరిలో కరీంనగర్ అదనపు డీసీపీ పి. వెంకటరమణ, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఆర్.జి. శివ మారుతి, సైబరాబాద్ సీటీసీ ఏసీపీ ఆశాల గంగారామ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి. రవికుమార్ రెడ్డి, టీజీ ఈగిల్ ఫోర్స్ డీఎస్పీ బచలకుర రమేష్, సీఐడీ డీఎస్పీ బి. శ్రీనివాసరావు, టీజీఎస్పీ 8వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ డి. సత్యనారాయణ, సైబరాబాద్ ఇన్స్పెక్టర్ పి. జగదీశ్వర్, ఆక్టోపస్ హెడ్ కానిస్టేబుల్ సి. రాములు, పిటిఓ హెడ్ కానిస్టేబుల్ కురపాటి తిరుపతి రాజు ఉన్నారు. వీరితో పాటు గ్రేహౌండ్స్కు చెందిన హోంగార్డు మేడిపల్లి యాదయ్య కూడా ప్రశంసనీయ సేవా పతకాన్ని సాధించడం విశేషం.
తాజావార్తలు
-
Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
-
RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి
-
IMD Alert: ఎర్రకోట వేడుకలకు వరుణుడు అడ్డంకి.. ఐఎండీ హెచ్చరిక
-
Ajit Doval: “మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు”.. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
-
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!