Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
- తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల ప్రకటన
- ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
- గ్రేహౌండ్స్ సిబ్బందికి శౌర్య పతకాలు
- వివిధ విభాగాల అధికారులకు ప్రశంసనీయ సేవా పతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Medals : భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు అధికారులు , సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పతకాలతో గౌరవించింది. విధుల్లో చూపిన అసమాన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు , నిబద్ధతకు గుర్తింపుగా ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం’ (PPMDS), ‘శౌర్య పతకం’ (PMG) , ‘ప్రశంసనీయ సేవా పతకాలను’ (PMMS) ప్రకటించింది. ప్రజాసేవలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ పురస్కారాలు లభించాయి.
విశిష్ట సేవా పతకాలు , శౌర్య పురస్కారాల గ్రహీతలు
అత్యున్నతమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి (President’s Medal for Distinguished Service)గాను హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య జోగుల ఎంపికయ్యారు. అలాగే ప్రాణాలకు తెగించి పోరాడే వీరోచిత ప్రతిభ కనబరిచినందుకు గాను గ్రేహౌండ్స్ రంగానికి చెందిన బి. సత్యరావు (పిసి), కె. సందీప్ కుమార్ (పిసి), జె. వంశీకృష్ణ (పిసి)లు అత్యంత ప్రతిష్టాత్మకమైన శౌర్య పతకాలను (Medal for Gallantry) దక్కించుకున్నారు.
Also Read
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
ప్రశంసనీయ సేవా పతకాల (మరిటోరియస్ సర్వీస్) విజేతలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి. వీరిలో కరీంనగర్ అదనపు డీసీపీ పి. వెంకటరమణ, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఆర్.జి. శివ మారుతి, సైబరాబాద్ సీటీసీ ఏసీపీ ఆశాల గంగారామ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి. రవికుమార్ రెడ్డి, టీజీ ఈగిల్ ఫోర్స్ డీఎస్పీ బచలకుర రమేష్, సీఐడీ డీఎస్పీ బి. శ్రీనివాసరావు, టీజీఎస్పీ 8వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ డి. సత్యనారాయణ, సైబరాబాద్ ఇన్స్పెక్టర్ పి. జగదీశ్వర్, ఆక్టోపస్ హెడ్ కానిస్టేబుల్ సి. రాములు, పిటిఓ హెడ్ కానిస్టేబుల్ కురపాటి తిరుపతి రాజు ఉన్నారు. వీరితో పాటు గ్రేహౌండ్స్కు చెందిన హోంగార్డు మేడిపల్లి యాదయ్య కూడా ప్రశంసనీయ సేవా పతకాన్ని సాధించడం విశేషం.
తాజావార్తలు
-
Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్పై రెండేళ్ల నిషేధం..
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!