ఇంధనంతో నడిచే వాహనాలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి.. రోజురోజుకీ పెరిగిపోతున్న వాహనాలు.. క్రమంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.. దీంతో, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు.. అందులో భాగంగా ఇప్పటికే రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి.. భవిష్యత్లో వాహనరంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక భూమిక పోషించనున్నాయి.. ఇక, ఆ వాహనాలను కొనుగోలు చేసేవారికి శుభవార్త వినిపించింది తెలంగాణ ప్రభుత్వం.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని…
ఓ వైపు కోవిడ్ మహమ్మారితో యుద్ధం చేస్తుంటే మరో వైపు ఇతర వ్యాధుల పెరుగుదల, మరణాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా తెలంగాణపై క్యాన్సర్ పంజా విసురుతోంది. ప్రతీ ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎంతగా పెరుగుతోందంటే గత 30 ఏళ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. 1990లో ఉమ్మడి ఏపీలో ఒక లక్షమంది జనాభాకు 54 క్యాన్సర్ రోగులు…
సీనియర్ పొలిటీషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిన సర్కార్.. అదే విధంగా.. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించంది… ఇక, రేపు మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా.. రంగారెడ్డి, హైదారబాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ…
తెలంగాణలో కరెంట్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. డిస్కంలు సమర్పించిన ఏఆర్ఆర్లు(వార్షిక ఆదాయ అవసరాలు) ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. విద్యుత్ డిస్కంలు 2021-22, 2022-23 సంవత్సరాలలో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఏఆర్ఆర్ ప్రతిపాదనలను మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ సందర్భంగా తాము రూ.21,550 కోట్ల రెవెన్యూ లోటును కలిగి ఉన్నామని.. దీనిని పూడ్చాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదని ప్రతిపాదనల్లో డిస్కంలు స్పష్టం చేశాయి. 2021-22 కాలానికి రూ.45,618 కోట్ల లోటు, 2022-23 కాలానికి…
తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్సైట్లో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్తో సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మిస్తే రైతు బంధు కట్ చేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు ధరణి పోర్టల్ వచ్చాక లక్షల ఎకరాల్లో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. Read Also:…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి వెబ్సైట్ లో భారీ మార్పులకు సిద్ధమైంది. నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్ తో సమస్యల పరిష్కారం చూపించనుంది. వ్యవసాయ భూమిలో ఇండ్లు నిర్మించుకుంటే రైతుబందు అమలు నిలిపివేయనున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లాయి. ధరణిలో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణిలో సమస్యల పై కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు వేలాది మంది రైతులు.…
పల్లె దవాఖానలపై మంత్రి హారీష్ రావు కీలక ప్రకటన చేశారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆశా కార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్ కార్డుల పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువలో తేవాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా భవిష్యత్తులో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని స్పష్టం చేశారు హరీష్ రావు.…
కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టంపై కార్మికులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళనతో ఉన్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాము రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినా కేంద్రం వినడం లేదని, బావుల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. తాము విద్యుత్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పార్లమెంట్లో సాగు చట్టాలను రద్దు చేసే సమయంలోనే దీన్ని కూడా రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రం విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ చట్టానికి…
స్థానిక ప్రజా ప్రతినిధులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో ….నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నట్టు సమాచారం. గౌరవ వేతనాల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, ఉపమేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయడానికి వీల్లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కాగా ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30 శాతం…