ఎవరికీ నష్టం జరగకుండా విద్యుత్ ఛార్జీల పెంపు : శ్రీరంగారావు,TSERC చైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ విద్యుత్ చార్జీల పెంపుపై తెలంగాణ రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) చైర్మన్ శ్రీరంగారావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకపోతే, సుమోటోగా తీసుకొని విద్యుత్ ఛార్జీలు పెంపు పై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎవరికీ నష్టం జరగకుండానే విద్యుత్ ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. సరైన సమయానికి విద్యుత్ డిస్కంలు, ఏ ఆర్ ఆర్ సమర్పించక పోవడంతో గతంలో ఇచ్చిన వాటిని తిరస్కరించినట్టు చెప్పారు. విద్యుత్ సంస్థలు కరెంట్ చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ సమర్పించేందుకు మరొకసారి గడువు ఇచ్చామన్నారు.
చార్జీలు పెంచిన, పెంచకపోయినా ప్రతి ఏడాది విద్యుత్ డిస్కంలు విధిగా ఏఆర్ఆర్ సమర్పించాల్సిందేనన్నారు. నవంబర్ మొదటి వారంలో కల్లా ఏఆర్ఆర్ లు, టారిఫ్ ప్రపోజల్స్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నాలుగేళ్లుగా విద్యుత్ డిస్కంలు ఏఆర్ఆర్లను సమర్పించడం లేదన్నారు. ఈనెల 27 తర్వాత డిస్కంలు టారీఫ్ అందించకపోతే ఈఆర్సి నిబంధనల ప్రకారం జరిమానా వేసే హక్కు ఉంటుందన్నారు. డిస్కంలు మరోసారి ఏఆర్ఆర్ లు, టారిఫ్లు సరైన సమయంలో అందించకపోతే తామే విద్యుత్ చార్జీలపై పబ్లిక్ హియరింగ్ చేసి చార్జీల పెంపు ప్రకటన చేస్తామన్నారు. చార్జీల పెంపు స్వల్పంగానే ఉండొచ్చని శ్రీరంగారావు పేర్కొన్నారు.
Also Read
- CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
- CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
- Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
- CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
తాజావార్తలు
-
India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
-
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!