Speaker Ayyanna Patrudu: మరోసారి హాట్ కామెంట్లు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.. సభలో ప్రతికూల చర్చలు జరగకుండా, రోడ్లపై మాత్రమే మాట్లాడడం సహజమేనా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజల పక్షాన చర్చించాలనుకుంటే సభకు రండి. మీరు లేవనెత్తే ప్రతీ అంశానికి మంత్రులు ద్వారా సమాధానం ఇవ్వడం నా బాధ్యత అని స్పష్టం చేశారు.. రోడ్లపై చేసే ఈ గుద్దుటల సంస్కృతి ఏమిటో అర్థం కావడం లేదు? అని ఆవేదన వ్యక్తం చేశారు స్పీకర్..
Read Also: Money Laundering Case: హౌసింగ్ సొసైటీ స్కామ్లో ఈడీ ఉచ్చు.. రూ.16.35 కోట్ల ఆస్తులు జప్తు.!
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇక, మరోసారి నో వర్క్.. నో పే విధానంపై స్పందించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. నో వర్క్.. నో పే విధానం ఏమ్మెల్యేలకు అమలు చేయాలని పేర్కొన్నారు.. రాజ్యాంగ బద్ధంగా అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నా వంటి మనస్తత్వం ఉన్నవారికి సూట్ లేదు. ఈ ఎన్నికల్లోనే పోటీ వద్దనుకున్నాను, ఇంకా కొనసాగిస్తే గౌరవం కూడా మిగిలే పరిస్థితి లేదు అని వ్యాఖ్యానించారు.. మరోవైపు, విశాఖలో భూముల ధరలు పెరగడం, రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైన ఫిర్యాదులు లేకపోవడం, సామాజిక మరియు పాత్రికేయుల బాధ్యతలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ అయ్యన్న అన్నారు.. పాత్రికేయులు కూడా సమాజహితం కోసం పనిచేయాలి.. వక్రీకరణల ద్వారా అసలు విషయం పక్కదారిపడుతోంది. స్పీకర్ వ్యాఖ్యలు, అసెంబ్లీ రోడ్లపై కాకుండా సభలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సందేశంగా భావించవచ్చు అని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?