రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడమే కారణమని తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 120 మంది ఖైదీల విడుదల జాబితాను తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు హోంశాఖకు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రెండు సార్లు క్షమాభిక్షలు ప్రసాదించింది. వందలాది మంది జీవిత ఖైదీలు విడుదల కాలేకపోవడం వల్ల 35 సంవత్సరాలుగా జైళ్ల నాలుగు గోడల మధ్య ఖైదీలు నలిగిపోతున్నారు.
Telangana: తెలంగాణ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Increase Ration: తెలంగాణలోని రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీలర్ల కమీషన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డీలర్ల నుంచి రూ. 70 కమీషన్ ఇస్తుండగా.. ఆ ముద్దును రెట్టింపు చేసింది.
అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Telangana Govt: తెలంగాణలో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం 466 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది.
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డైట్ ఛార్జీల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో పెరిగిన డైట్ ఛార్జీలు జులై నెల నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో ప్రకటించింది. అయితే, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ. 950 నుంచి రూ.1,200లకు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వారికి 1,400, ఇంటర్…
తెలంగాణ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. గతంలో కూడా వరుస నోటిఫికేషన్ లను విడుదల చేసింది ప్రభుత్వం.. ఇప్పుడు కూడా వరుస ప్రభుత్వ శాఖలకు సంబందించిన వాటిల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు .. ఈ మేరకు నిరుద్యోగుల పాలిట ఆపన్న హస్తం అవుతుంది.. రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు…
Harish Rao: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతుల కల సాకారం కానుంది. వీరికి పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలను అందజేయనున్నారు.