JD Lakshminarayana: తెలంగాణ ప్రభుత్వం చొరవ అభినందనీయం.. అప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Lakshminarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ముందుకు వెళ్లడంలేదని ప్రకటించింది. అయితే, అంతకుముందే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల బృందం స్టీల్ ప్లాంట్లో పర్యటించడంతో.. ఆ ప్రకటన తర్వాత క్రెడిట్ గేమ్ నడిచింది.. మా పోరాటం వల్లే కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిందంటే.. లేదు మా వల్లే అంటూ అంతా హడావిడి స్టార్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు.. వారికి స్థానికుల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. గోపాలపట్నం దగ్గర గులాబీ పువ్వులు ఇచ్చి సంఘీభావం ప్రకటించారు స్థానికులు.. ఇక, ఈ పాదయాత్రలో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ కీలకవ్యాఖ్యలు చేశారు..
Read Also: Nizamabad News: రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన వైనం.. వీడియో వైరల్
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EOIకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.. అయితే, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు EOIకి వచ్చినప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అంటున్నారు లక్ష్మీనారాయణ.. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన చొరవ అభినందనీయమన్న ఆయన… EOIలో భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాను అన్నారు.. అవసరం అయితే EOIను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.. రాజకీయాలకు అతీతంగా స్టీల్ పరిరక్షణ పోరాటం సాగించాల్సిందేనని పిలుపునిచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ.. కాగా, గతంలో సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేసిన విషయం విదితమే.. “సింగరేణికి చెందిన ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయాలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్లో పాల్గొనాలి” అంటూ ట్వీట్ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!