Vizag Steel Plant: ఆ విషయం బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.. లేదంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకరేపుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్న సింగరేణి డైరెక్టర్ల బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్నారు.. ఈవోఐ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధ్యసాధ్యలపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు.. మరో రెండు రోజుల పాటు విశాఖలో సింగరేణి అధికారుల బృందం పర్యటించనుంది.. అయితే, ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్గానే స్పందిస్తోంది.. ఎన్టీవీతో మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. బిడ్లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్టే అంటున్నారు.
ఇక, రాజకీయ కారణాలతోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని తెలిపారు మంత్రి అమర్నాథ్.. బీఆర్ఎస్కు, బీజేపీతో ఉన్న రాజకీయ విబేధాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కానీ, బిడ్ లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే అంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే బిడ్ లో పాల్గొంటాం అంటే అర్థం ఏంటి? అని నిలదీశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే మాతో పాటు కలిసి వస్తే ఆహ్వానిస్తామన్న ఆయన.. ప్రజల సెంటిమెంటును గౌరవిస్తారా? లేదా? చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతందని స్పష్టం చేశారు.. ప్రజల సెంటిమెంటును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటాయన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Also Read
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
అసలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనే అర్హత లేదన్నారు మంత్రి అమర్నాథ్.. కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ శాఖ గత ఏడాది ఈ నిబంధనను వెల్లడించిందన్న ఆయన.. ఈ నిబంధన ఉంటే తెలంగాణ ప్రభుత్వం కానీ, సింగరేణి సంస్థ కానీ.. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎలా బిడ్లో పాల్గొంటుంది? అని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. మొత్తంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో కాకరేపుతోంది. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!