Anti Dowry Act: బాబోయ్ ఇది నిజమా.. కట్నం తీసుకుంటే కటకటాలకేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti Dowry Act: ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పెళ్లి విషయానికి వస్తే కట్నం ఎంత అని అడగడం పరిపాటిగా మారింది. కొంతమంది వరులు చాలా గట్టిగా కట్నం డిమాండ్ చేస్తారు. వరుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడంటే చాలు.. భూములు అమ్ముకోవాల్సి వస్తోంది. అంతే.. పెళ్లయిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తే.. తట్టుకోలేక వివాహితలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన ఈ వరకట్నం విషయంలో మాత్రం పాత సంప్రదాయాలే కొనసాగుతుండటం బాధాకరం. ఇవ్వగలిగిన వారి పరిస్థితి అలా ఉంచితే.. ఇవ్వలేని వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. వరకట్నాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినా.. వాటిని పాటించే వారు తక్కువే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వరకట్న సంప్రదాయానికి చరమగీతం పాడేలా కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. వరకట్నం విషయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Read also: Pushpa 2: ఆమె అసలు ‘రష్మిక కాదు ‘ఇషా’
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
వరకట్నం తీసుకునే వరుడి పట్టా రద్దు విధానాన్ని కేరళ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం కేరళలో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేరళలోని వరకట్న వ్యతిరేక విధానాన్ని హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ అధ్యయనం చేశారు. కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో… ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేస్తే… మంచి ఫలితాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్కు ప్రతిపాదనలు కూడా సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు అవసరమైన ప్రోటోకాల్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఉన్నత విద్యామండలి, మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వరకట్నం తీసుకుంటే పట్టా రద్దు విధానాన్ని అమల్లోకి తెస్తే ఇలాంటి సంప్రదాయానికి పూర్తిగా స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
MNJ Hospital: ఆసుపత్రిలోనే పాఠశాలు.. క్యాన్సర్ బాధిత పిల్లలకు సర్కార్ గుడ్ న్యూస్
తాజావార్తలు
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
-
Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?