న్యాయాన్నే నమ్ముతూ.. చట్టాన్నే ఆయుధంగా చేసుకుంది ఆ యువతి! తనకెలాంటి అన్యాయం జరగదని భావించింది..!! ఎందుకంటే.. ఎదుట ఉన్నది తన రక్తసంబంధమే. సొంత అన్నే కదా.. ఏ ఆపదా రాదనుకుంది. కానీ.. అమ్మ ఒడిలో కలిసి పెరిగిన అన్నయ్యే.. యముడిలా మారాడు. భూమి కోసం సొంత చెల్లిని కిరాతకంగా హతమార్చాడు. భూమి కోసం మానవసంబంధాలనే పూడ్చిపెట్టిన కిరాతక ఘటన మనసును కదిలిస్తోంది. అమ్మ లో అ… నాన్న లో న్న.. రెండూ కలిస్తే అన్న!! అమ్మా నాన్నల…
Charlapalli Suicide Case: చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి.. ఘటనలో మిస్టరీ వీడటం లేదు. సెల్ఫోన్, ల్యాప్టాప్ డేటా బహర్గతం ఐతే.. ఏదైనా క్లూ దొరకొచ్చు అనుంటే... ఇక్కడా ఏం లభించలేదు. రెగ్యులర్ చాట్, అఫీషియల్ మెయిల్స్ తప్ప అనుమానాస్పద డేటా గుర్తించలేదు పోలీసులు. ఏం జరిగిందనే చిక్కుముడి వీడటం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా.. ఎక్కడా ఎలాంటి క్లూస్ లభించడం లేదు. మరి ముగ్గురు ఆత్మహత్య కేసులో చివరగా…
మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అడ్వకేట్ స్వప్నని హత్య చేసిన సొంత అన్న రాజు తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజుతో పాటు కావళి శివలింగం, వడ్డే వీరేష్, ఎర్రోళ్ల సందీప్ లు అరెస్టయ్యారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మోయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసు వివరాలు.. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గోటికె స్వప్న దారుణ హత్యకు గురైంది.…
Advocate Swapna Murder: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో సంచలన హత్య జరిగింది. ఆస్తి వివాదమే కారణంగా అడ్వకేట్ స్వప్నను ఆమె సోదరుడు రాజు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం…
Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ను CCS పోలీసులకు పంపారు. మొబైల్లో కొన్ని అనుమానిత మెసేజ్లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు…
Woman Kills Parents: వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారనే కోపంతో.. కన్న కూతురే తన తల్లిదండ్రులను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి, తన ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు అనస్థీషియా ఇంజెక్షన్ ను ఓవర్ డోస్ ఇచ్చి ప్రాణాలు…
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్ను ఓదార్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్గా ఉన్నప్పటికీ.. నిన్నటి కంటే కొంత మెరుగుపడిందని వైద్యులు…
Illegal Affair: సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పరిధిలోని నిమ్మనపేటలో చోటు చేసుకుంది.
Medchal Malkajgiri: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రహస్యంగా మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ అక్రమ దందాను బయటపెట్టారు. మేకలు, గొర్రెల నుంచి అనధికారికంగా రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఓ మటన్ షాప్ యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Bride Death: రాజేంద్రనగర్ లో నవ వధువు మృతి చెందింది. అయితే, జన చైత్యన ఫేజ్ టూలో ఉంటున్న కొత్త జంట.. నిన్న (ఆదివారం) రాత్రి అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఫిడ్స్ తో ఐశ్వర్య కుప్పకూలింది.