Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..
- సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో భద్రతా లోపాలు..
- సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చిన కిలాడీ లేడీ..
- బంగారు ఆభరణాలతో పరార్..
చేతిలో స్టెతస్కోప్.. ఒంటిపైన డాక్టర్ కోటు.. దర్జాగా లోపలికి ఎంట్రీ.. ఆ తర్వాత నింపాదిగా ఆస్పత్రి నుంచి ఎగ్జిట్. సీన్ కట్ చేస్తే ఓ మహిళా పేషెంట్ మెడలో బంగారు ఆభరణాలు చోరీ. ఆస్పత్రి నిండా సీసీ కెమెరాలు.. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది.. అయినా పసిగట్టని వైనం. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఘటన. మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు కొట్టేసింది ఎవరు? ఆస్పత్రి సిబ్బంది ఏం తేల్చింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోయిన్పల్లికి చెందిన సుధారాణి .. అనారోగ్య సమస్యలతో యశోద ఆసుపత్రిలో మార్చి 10న అడ్మిట్ అయింది. మార్చి 11 న ఆమెను డిశ్చార్జ్ చేసే సమయంలో కొన్ని టెస్ట్లు చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో ఆమె అడ్మిట్ రూమ్లొనే వేచి చూస్తోంది. ఐతే డాక్టర్ వేషధారణలో ఉన్న ఓ మహిళ.. పేషేంట్ సుధారాణి రూంలోకి వచ్చింది. వెంటనే హడావుడి చేసి అందరినీ బయటకు పంపించింది. లోపలి నుంచి తలుపులు వేసేసింది. తరువాత ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించింది.
Also Read:Inter Student: కామాంధుడిగా మారిన ఇంటర్ విద్యార్థి.. ప్రేమ పేరుతో ముగ్గురు అమ్మాయిలను ఇలా..
Also Read
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
డాక్టర్ వెళ్లిన అనంతరం రూములోకి వెళ్లిన బంధువులు.. సుధారాణి స్పృహలో లేకపోవడం గమనించారు. అంతే కాదు ఆమె ఒంటిపై ఉన్న బంగారం కనిపించకపోవడంతో.. వెంటనే యశోద యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేదని ఆస్పత్రి యాజమాన్యం తెలపడంతో.. మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యశోద ఆస్పత్రిలో ఉన్న సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. అందులో ఓ మహిళ డాక్టర్ కోటు ధరించి లోపలికి వచ్చి.. మళ్లీ తిరిగి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. నిజానికి ఆస్పత్రి సిబ్బంది అందరి మెడలో ఐడీ కార్డులు ఉన్నాయి. కానీ ఐడీ కార్డు లేకుండా వచ్చిన మహిళను భద్రతా సిబ్బంది ఎవరూ అడ్డుకోలేదు. దీంతో తాపీగా వచ్చి పని చూసుకుని తిరిగి వెళ్లిపోయింది. మొత్తంగా సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిలాడీ లేడీ డాక్టర్ను పట్టుకునే పనిలో పడ్డారు.
ఐతే వందల మంది భద్రతా సిబ్బంది.. పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ధైర్యంగా వచ్చి బంగారు ఆభరణాలు చోరీ చేసి వెళ్లిన మహిళ తీరుపై పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనలో యశోద ఆస్పత్రిలో సెక్యూరిటీ డొల్లతనాన్ని బయటపెట్టింది.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
-
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
-
Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!
-
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
-
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!