Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
- తొలి వన్డేలో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన
- బంతితో నాలుగు వికెట్లు, బ్యాటింగ్లో అర్ధ శతకం
- భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
- అక్షర్ పటేల్ అరుదైన ఘనత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బంతితో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాటింగ్లో అజేయ అర్ధ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. అక్షర్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
బౌలింగ్లో అక్షర్ పటేల్ తన 10 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 259 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 165 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అక్షర్.. వాషింగ్టన్ సుందర్తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి చేర్చాడు. అక్షర్ 57 పరుగులతో నాటౌట్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్ (52) కూడా అజేయ అర్ధశతకం సాధించాడు.
Also Read
- Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
- Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
ఈ ప్రదర్శనతో అక్షర్ పటేల్ భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే వన్డే మ్యాచ్లో 50కి పైగా పరుగులు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రత్యేక జాబితాలో ఇప్పటికే క్రిష్ణమాచారి శ్రీకాంత్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ (రెండుసార్లు), యువరాజ్ సింగ్ (రెండుసార్లు), హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజాలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా వారి సరసన చేరాడు.
భారత్ తరఫున ఒకే వన్డేలో 50కి పైగా పరుగులు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అక్షర్ చేరడం విశేషం. 1988లో న్యూజిలాండ్పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఘనత సాధించగా.. 1998లో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్, 1999 అండ్ 2000లో సౌరవ్ గంగూలీ, 2008 అండ్ 2011లో యువరాజ్ సింగ్, 2022లో హార్దిక్ పాండ్యా ఈ రికార్డును నమోదు చేశారు. ఇప్పుడు 2026లో ఇంగ్లండ్పై అక్షర్ పటేల్ కూడా అదే ఘనతను అందుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా భారత జట్టు వివిధ కాంబినేషన్లను పరీక్షిస్తున్న తరుణంలో అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శన టీమ్ మేనేజ్మెంట్కు భారీ ఊరటనిచ్చింది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!