మందు తాగుదామని చెప్పి మత్తులోకి చేరుకున్నాక స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ ఫతేలి ఆటోడ్రైవర్ (32) వృత్తి రిత్యా ఆటోడ్రైవర్. పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ జహంగీర్ లు స్నేహితులు. వీరిద్దరు తరచు మద్యం సేవిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే అబ్దుల్ ఫతేలికి మద్యం తాగుతామని చెప్పి జహంగీర్ మద్యంతో పాటు ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని బాలాపూర్ బారామల్గి వెనుక వైపుకు వచ్చాడు.…
Hyderabad: మేడ్చల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ దారుణం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ ప్రస్తుతం మేడ్చల్లో నివసిస్తున్నాడు. అతని కుమారుడు షేక్ సాతక్ తన స్నేహితుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Husband Throws Wife: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బ్రిడ్జ్ పైనుంచి భార్యను తోసి హత్య చేసిన సంఘటన ఆదివారం నాడు అర్ధరాత్రి జరిగింది.
Crime News: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చిన కూతురు.. ఏం తెలియనట్టు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో చిన్న కూతురు నవనీత బాగోతం బయట పడింది.
Kumuram Bheem Asifabad: భార్య మీద కోపంతో అత్తింటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి... ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లా పటార్లో చోటు చేసుకుంది. ఎల్లాపటార్కు చెందిన షమాబీకి జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్తో 9 నెలల కిందట వివాహం జరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముజాహిద్.. షమాబీతో తరుచూ గొడవ పడేవాడు. తాజాగా ఎల్లాపాటార్ వచ్చి మళ్ళీ భార్యతో గొడవపెట్టుకున్నాడు.. గొడవ ఒక్కసారిగా పెరిగింది.…
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్గా పని…
Hyderabad: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లు ఉంటుందని అంచనా.. బొల్లారంలోని సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్పై దాడి చేసి.. ఫ్లాట్ నుంచి 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కింగ్ పిన్ శివ రామకృష్ణ, అనిల్, వెంకట కృష్ణారావు, దొరబాబు అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మరో నిందితుడు సూళ్లూరుపేటకు చెందిన ఎం. ప్రసాద్…
Khammam Murder Case: ఖమ్మం జిల్లా కామేపల్లి మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలను వెలుగులోకి వచ్చాయి. మర్డర్ చేయడం.. ఆ తర్వాత ఆనవాళ్లను చెరిపేయడం.. డెడ్ బాడీని మాయం చేయడం లాంటి వాటిని నిందితులు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ కంత్రీలు ఎవరు? ఎందుకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చంపారు? కేవలం బంగారం కోసమే హత్య చేశారా? READ ALSO: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు.. ఏఐ వీడియోలు ఉపయోగించొద్దని…
Hyderabad: సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయితీ... ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ.. ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ధిచెప్పాల్సిన పెద్దలు.. రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి చాతినొప్పి అంటూ తల్లిడిస్తూ పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఘట్కేసర్ పరిధిలోని ఔషపూర్లో జరిగిన ఘటన విషాదం నింపుతోంది.