కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్వర్క్ను కరీంనగర్ పోలీసులు చేధించారు. స్థానిక ఆర్బిఎల్ (RBL) బ్యాంకును వేదికగా చేసుకుని సుమారు 139 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’లో భాగంగా సాగించిన ఈ విచారణలో మ్యూల్ అకౌంట్ల (Mule Accounts) ద్వారా సాగుతున్న ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు బ్యాంకు సిబ్బందితో సహా మొత్తం 13 మందిని…
Medchal District: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్లో దారుణం చోటు చేసుకుంది. గత ఏడాది క్రితం అంజూ అనే మహిళ అదృశ్యమైనట్లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజూ అదృశ్యంపై విచారణలో భాగంగా పోలీసులు పలు కోణాల్లో విచారించగా చిన్న కుమార్తె కూతురు ఇషికా, అల్లుడి కుమార్పై అనుమానాలు వచ్చాయి. లొతుగా విచారించగా సంచలన నిజాలు బయటకు వచ్చాయి. కన్న కూతురు, అల్లుడు తల్లిని…
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్, కాల్పుల కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, రితేశ్రెడ్డి, నమిత్శర్మను కస్టడీలోకి తీసుకుంది సిట్. మరోవైపు డ్రగ్స్ను సరఫరా చేసిన అభిషక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తండ్రి.. సవతి తల్లి కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. ఆస్తి కూడా దక్కదని తెలిసి రాక్షసునిగా మారాడు. ఏకంగా తండ్రిని, సవతి తల్లి కుటుంబాన్ని మూకుమ్మడిగా హత్య చేయాలని డిసైడయ్యాడు.
అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన మాట వినడం లేదని, ఇతరులతో చనువుగా ఉంటోందని భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఘటన షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్పై తరలించి పొలాల్లో పడేసిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్య కు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏసిపి లక్ష్మీనారాయణ మీడియాకు వివరించారు.…
చుట్టూ చిమ్మ చీకటి.. అమ్మా.. అమ్మా.. అని వెక్కి వెక్కి ఏడుస్తున్నా తల్లి లేవడం లేదు. అసలు ఎక్కడ ఉన్నామో తెలియదు.. దిక్కులు పిక్కటిల్లేలా ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడ్చింది. కానీ ఆ చిన్నారి రోదన అరణ్యంలో ఆర్తనాదం లాగే మిగిలిపోయింది. తెల్లారిన తర్వాత స్థానికులు వచ్చి చూసే సరికి.. తల్లి శవంగా పడి ఉంది. ఆ పక్కనే చిన్నారి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి ఉంది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? ఆ…
Karimnagar SI Chandrasekhar Suicide: కరీంనగర్ టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆయన భార్య దివ్య నాలుగు రోజుల క్రితం కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. దివ్య ఆత్మహత్య చేసుకోవడానికి చంద్రశేఖర్ వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రశేఖర్కు ఇల్లందకుంట మండలం సీతంపేటకు…
ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడ్డాడు.. వినకపోవడంతో కుటుంబసభ్యులను బెదిరించాడు. ఐనా యువతి దారిలోకి రాకపోవడంతో, చివరకు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడో ప్రేమోన్మాది. కొద్ది సేపటికే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో తన కూతురును ప్రేమించమంటూ వెంటపడ్డ యువకుడే హత్య చేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చిలకలగూడలో ఈ ఘటన కలకలం సృష్టించింది. చిలకలగూడలోని శ్రీనివాస్నగర్లో కోటేశ్వర్రావు, రమాదేవి కుటుంబం నివాసం ఉంటోంది. కూరగాయల వ్యాపారం చేసే ఈ దంపతుల కూతురు…
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడై, ఐదు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ గంధం వైష్ణవి (21) హత్య స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది కాలంగా మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి, కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ప్రేమించుకున్నారు. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించినప్పటికీ, వైష్ణవిపై ఉన్న…
హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి… అత్యాచారం చేయడమే కాకుండా కిరాతకంగా హతమార్చాడు. బాలిక మృతదేహాన్ని ముళ్లపొదల్లో వేసి.. తనకేం తెలియనట్లు వెళ్లిపోయాడు. బాలిక మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు… కిరాతకుడిని పట్టుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకి తరలించారు పోలీసులు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు.. .ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ…