Siddipet District: అప్పుల బాధ భరించలేక గడ్డి మందు త్రాగి దంపతుల ఆత్మహత్య ఘటన కలచివేసింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష-రుక్మిణి దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురి వద్ద లక్షల్లో అప్పులు చేశారు. డబ్బులు ఇవ్వాలని శ్రీహర్షని అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు బెదిరించారు. నిన్నటి రోజు(శనివారం) డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ.. ఆదివారం చెల్లించాలన్నారు. నేటితో గడువు ముగియడంతో గ్రామంలో తన పరువు పోతుందని పురుగుల మందు…
మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో దారుణం చోటుచేసుకుంది. దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో ఓ తల్లి.. కన్నకూతురినే మూడంతస్థుల బిల్డింగ్ పై నుంచి పడేసింది. ఈ ఘటన స్థానికంగా అందరిని కలచివేసింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పూర్తివివరాల్లోకి వెళితే.. మల్కాజ్ గిరి వసంతపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. తన పాపను దేవుడు మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో మోనాలిసా అనే మహిళ తన…
Hyderabad: దువ్వాడ మాధురి, శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్థసారథి అనే వ్యక్తి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించారు. అతడి పుట్టినరోజు సందర్భంగా రాత్రి The pendent ఫామ్ హౌస్లో పార్టీ ఎరేంజ్ వేశాడు. ఈ పార్టీ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ & మాధురిలను పార్థసారథి ఆహ్వానించారు. మొయినాబాద్ లోని The Pendent ఫామ్ హౌస్ లో బర్దీప్ డే పార్టీ జరుగుతుండగా అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు…
Hyderabad: నగరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో రియల్టర్ దారుణ హత్య కలకలం సృష్టించింది.. ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ ముందు దుండగులు వెంకటరత్నం(50) అనే రియల్టర్ను నడిరోడ్డుపై షూట్ చేసి చంపారు. కాల్పులు జరిపి కత్తులతో నరికి హత్య చేశారు.. పాపను స్కూల్లో దించి స్కూటర్ పై తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్తో పాటు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.. వెంకటరత్నంపై ధూల్పేట్లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు.…
I bomma Ravi: సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవిని మరోసారి కస్టడీ అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు ఐ బొమ్మ రవి..
Hyderabad: ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి(26) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ యువతి ప్రేమించి మోసం చేసిందనే కారణంతో పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుర్రా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్…
Hyderabad: హైదరాబాద్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భాను ప్రకాష్ తుపాకీ మిస్స్ అయ్యింది. ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Mule Accounts : హైదరాబాద్లో భారీ స్థాయిలో జరిగిన సైబర్ మోసాన్ని నగర పోలీసులు బట్టబయలు చేశారు. అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ‘బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే డబ్బులు ఇస్తాం’ అని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆధారంతో ముందుకు సాగిన విచారణలో రాజస్థాన్కు చెందిన కన్నయ్య…
Jagtial: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదనో, లేక ఫోన్ కొనివ్వలేదో ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చూశాం.. గేమ్స్ ఆడొద్దని కట్టడి చేసిన పిల్లలు సైతం బలవన్మరణానికి పాల్పడటం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పిల్లాడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనోవేదన ఎవ్వరి వల్లో రాలేదు.. కన్న తల్లిదండ్రుల వల్లే వచ్చింది. తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారని మనస్థాపం చెందిన కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది.
Hyderabad: ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని అంబర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. బాగంబర్పేట్లో రామకృష్ణ నగర్ విషాదఛాయలు అలముకున్నాయి. 50 రోజుల క్రితం రామకృష్ణ నగర్ ఇంట్లో కిరాయికి వచ్చిన భార్యాభర్తలు శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య (15) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాంనగర్లో ఐదు నెలల క్రితం పెద్ద కూతురు కావ్య ఉరివేసుకుని సుసైడ్ చేసుకుంది. దీంతో కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. దీంతో కుటుంబానికి చెందిన మిగతా ముగ్గురు సైతం…