Hyderabad: ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ను CCS పోలీసులకు పంపారు. మొబైల్లో కొన్ని అనుమానిత మెసేజ్లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు…
Woman Kills Parents: వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డొస్తున్నారనే కోపంతో.. కన్న కూతురే తన తల్లిదండ్రులను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి, తన ప్రేమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు అనస్థీషియా ఇంజెక్షన్ ను ఓవర్ డోస్ ఇచ్చి ప్రాణాలు…
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్ను ఓదార్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్గా ఉన్నప్పటికీ.. నిన్నటి కంటే కొంత మెరుగుపడిందని వైద్యులు…
Illegal Affair: సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పరిధిలోని నిమ్మనపేటలో చోటు చేసుకుంది.
Medchal Malkajgiri: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రహస్యంగా మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ అక్రమ దందాను బయటపెట్టారు. మేకలు, గొర్రెల నుంచి అనధికారికంగా రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఓ మటన్ షాప్ యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Bride Death: రాజేంద్రనగర్ లో నవ వధువు మృతి చెందింది. అయితే, జన చైత్యన ఫేజ్ టూలో ఉంటున్న కొత్త జంట.. నిన్న (ఆదివారం) రాత్రి అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఫిడ్స్ తో ఐశ్వర్య కుప్పకూలింది.
Sangareddy Murder Case: జంట హత్యల ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని తెల్లాపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ జంట హత్యలు మొత్తం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మహిళతో పాటు 13 ఏళ్ల బాలుడిని శివరాజ్ అనే వ్యక్తి హత్య చేశాడు. అనంతరం ఆయన తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. READ ALSO: PMO Driver Salary : ప్రధాని మోడీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? పోలీసుల కథనం…
Siddipet District: అప్పుల బాధ భరించలేక గడ్డి మందు త్రాగి దంపతుల ఆత్మహత్య ఘటన కలచివేసింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష-రుక్మిణి దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురి వద్ద లక్షల్లో అప్పులు చేశారు. డబ్బులు ఇవ్వాలని శ్రీహర్షని అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు బెదిరించారు. నిన్నటి రోజు(శనివారం) డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ.. ఆదివారం చెల్లించాలన్నారు. నేటితో గడువు ముగియడంతో గ్రామంలో తన పరువు పోతుందని పురుగుల మందు…
మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో దారుణం చోటుచేసుకుంది. దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో ఓ తల్లి.. కన్నకూతురినే మూడంతస్థుల బిల్డింగ్ పై నుంచి పడేసింది. ఈ ఘటన స్థానికంగా అందరిని కలచివేసింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పూర్తివివరాల్లోకి వెళితే.. మల్కాజ్ గిరి వసంతపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. తన పాపను దేవుడు మళ్లీ పుట్టిస్తాడని ఓ మూడ నమ్మకంతో మోనాలిసా అనే మహిళ తన…
Hyderabad: దువ్వాడ మాధురి, శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్థసారథి అనే వ్యక్తి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించారు. అతడి పుట్టినరోజు సందర్భంగా రాత్రి The pendent ఫామ్ హౌస్లో పార్టీ ఎరేంజ్ వేశాడు. ఈ పార్టీ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ & మాధురిలను పార్థసారథి ఆహ్వానించారు. మొయినాబాద్ లోని The Pendent ఫామ్ హౌస్ లో బర్దీప్ డే పార్టీ జరుగుతుండగా అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు…