టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ… పేపర్ మీద టీమిండియా జట్టు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. హోం గ్రౌండ్లో పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ఎల్గార్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టీమిండియా మంచి ఆటతీరును కనిపరిచిందని.. అందుకే తాము…
టీమిండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీ వంటి దిగ్గజాల నేతృత్వంలో కూడా భారత్ టెస్ట్ సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు టీమిండియాను సువర్ణావకాశం ఊరిస్తోంది. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఈసారి సిరీస్ సాధించొచ్చని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 250 ప్లస్ స్కోరు చేసిందని.. అందుకే ఆ సిరీస్…
క్రికెట్ చరిత్రలో మొదటిసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీం ఇండియా 2019-20లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ను వారి గడ్డపై ఓడించింది. అయితే ఈ నాలుగు టెస్టుల సిరీస్ లోని చివరి మ్యాచ్ లో భారత రెగ్యులర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులుగా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి 5 వికెట్ హల్ తో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. దాంతో మ్యాచ్ అనంతరం అప్పటి టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి విదేశీ…
ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ తెగ వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ టీమిండియా క్రికెటర్లను కూడా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాసిన గడ్డంతో ‘పుష్ప’ లుక్లో కనిపిస్తూ… ‘పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదే లే’ అంటూ డైలాగ్ చెప్పడం…
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ మధ్య విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించి.. టీ20 కెప్టెన్ గా తప్పుకోవద్దు అని నేను కోహ్లీకి చెప్పను. కానీ వినలేదు. దాన్తజో వైట్ బల్ ఫార్మటు లో ఇద్దరు కెప్టెన్ లు ఉండకూడదు అని కోహ్లీని వన్డే కెప్టెన్ గా తప్పించారు. అయితే టీ20 కెప్టెన్ గా తప్పుకోవద్దు అని దాదా తనకు చెప్పలేదు…
ఈనెల 26 నుంచి టీమిండియాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఆన్రిచ్ నార్జ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే 20 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన నేపథ్యంలో నార్జ్ స్థానంలో కొత్త ఆటగాడిని సెలక్ట్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు అభిప్రాయపడింది. Read Also: అత్యాచారం కేసులో చిక్కుకున్న…
టీమిండియాలో ప్రస్తుతం కెప్టెన్సీ రగడ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఈ మధ్య అతడిని వన్డే సారథిగానూ తప్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ చెప్పడం అతడి అభిమానులను తెగ బాధించింది. కోహ్లీ-గంగూలీ చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉండటం క్రికెట్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేసింది. Read Also: విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెషల్ క్లాస్ 2014లో…
గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా ఓపెనర్ కేఎల్ రాహుల్ను బీసీసీఐ నియమించింది. తొలుత టెస్టులకు వైస్ కెప్టెన్గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ.. అతడు గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో తాజాగా కేఎల్ రాహుల్కు వైస్ కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. Read Also: ఒలింపిక్స్ రేసులోకి హీరో మాధవన్ తనయుడు దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత…
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈనెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫేస్ షీల్డులు, ఫేస్ మాస్కులతో దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా తమ దేశానికి చేరుకున్న తరువాత భారత క్రికెట్ జట్టు కఠినమైన నిర్బంధంలో నివసించాల్సిన అవసరం లేదని ఇప్పటికే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే. Read…
నిన్న విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ తో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషంగా లేడు. అయితే ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకున్నపుడు… టీ20లతో పాటు టెస్టులు, వన్డేలకు కూడా కెప్టెన్గా కోహ్లీనే కొనసాగమని కోరామని, కొన్ని రోజుల కిందట తాను వ్యక్తిగతంగా కోరానని గంగూలీ ప్రకటించాడు. కానీ దాదా కామెంట్స్ కి విరుద్దంగా కోహ్లీ బాంబ్ పేల్చడం… ఇండియన్ క్రికెట్ టీంలో సంచలనంగా…