ఆటగాళ్లు ఆటపై దృష్టిపెట్టాలి.. బీసీసీఐ టీమ్ మేనేజ్ మెంట్, టూర్లు, బిజినెస్ సంగతి చూడాలి. ఇక్కడ ఆ డివిజన్లో క్లారిటీ మిస్సయింది. ఇగోలు, పవర్ గేమ్ లు మొదలయ్యాయి. ఆటగాళ్లను కంట్రోల్ చేయాల్సిన బీసీసీఐ కంట్రోల్ తప్పుతోందా? లేని వివాదాలు సృష్టిస్తూ ప్లేయర్ల మధ్య గ్యాప్ పెంచుతోందా? భారత్ క్రికెట్ జట్టులో జరుగుతున్న పరిణామాలు… దేశ పరువును పొగొట్టేలా ఉన్నాయి. ప్లేయర్ల మధ్య భేదాభిప్రాయాలు వస్తే సరిదిద్దాల్సిన కెప్టెన్లే… ఇప్పుడు గొడవపడుతున్నారు. టీం ఇండియా కెప్టెన్లు రోహిత్…
ఇండియన్ క్రికెటర్లు అడ్డం తిరుగుతున్నారు. రోహిత్-విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు మరింత ముదిరిపోయాయ్. వన్డే సిరీస్కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యానంటున్నాడు కోహ్లీ. అనారోగ్యంతో టెస్టులకు దూరమయ్యాడు రోహిత్. ఐతే…కెప్టెన్సీ కోల్పోవటంతో కోహ్లీ మనస్తాపం చెందాడు. ఫలితంగా టీమిండియా ఆటగాళ్లలో వివాదాలు ముదిరిపోయాయ్. మరోవైపు…కోహ్లీని దారిలో పెట్టే పనిలో పడింది బీసీసీఐ. కోహ్లీ వ్యవహార శైలి ధిక్కారమే అంటున్నాయ్ బీసీసీఐ వర్గాలు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది బీసీసీఐ. దక్షిణాఫ్రికా టూర్ మొదలైనప్పటి నుంచి ఆ…
ఓమిక్రాన్ కేసుల మధ్య భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ సిరీస్ జరుగుతుందా.. లేదా అనే ప్రశ్న వచ్చింది. కానీ ఏది ఏమైనా బీసీసీఐ టీం ఇండియాను సౌత్ ఆఫ్రికా పంపడానికి బీసీసీఐ సిద్ధమైంది. కానీ ఈ పర్యటనలో మొదట టీ20 సిరీస్ కూడా ఉండగా… దానిని వాయిదా వేసింది. Read Also : బీసీసీఐ కెప్టెన్,…
భారత స్టార్ ఆల్రౌండర్ జడేజా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. గత నెలలో సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో జడేజా మోచేతికి గాయమైంది. అదే కారణంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు జడేజాను ఎంపిక చేయలేదు. అయితే …వీలైనంత త్వరగా జడేజాను టెస్టు క్రికెట్లో చూడాలనుకుంటున్న అభిమానులకు అతని నిర్ణయం నిరాశ కలిగించేదిగా…
బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఇంత కాలం ఎవరున్నా టీమిండియా సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే వినిపించేవి తప్ప, బీసీసీఐ తెరవెనుక ఉండేది. కానీ, గంగూలి ఎప్పడైతే సీన్ లోకి వచ్చాడో అప్పటి నుండి సీన్ మారింది. ఆటగాళ్ల మధ్య ఉన్న స్పర్థల్ని మరింత పెరిగేలా బీసీసీఐ ధోరణి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభేదాలు పరిష్కరించాల్సిన బీసీసీఐ కెప్టెన్, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. కెప్టెన్ గా కొహ్లీని తప్పుకోమని ఆదేశించే హక్కు బీసీసీఐకి ఉంది.…
కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని సెప్టెంబర్లో కోహ్లీ చెప్పారు. అప్పుడే వద్దని కోహ్లీకి చెప్పాం. మేము స్పందచలేదని చెప్పడం అవాస్తవం అని బీసీసీఐ తెలిపింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మరో కెప్టెన్ను నియమించాల్సి ఉంటుంది. అప్పుడు వన్డేలకు ఒకరు, టీ-20లకు మరొకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది. అది బీసీసీఐకి సమస్యగా మారుతుందని కోహ్లీతో చెప్పాం. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోమని గంట ముందు చెప్పామన్నది అవాస్తవం. వన్డేలకు రోహిత్…
బీసీసీఐ తన వన్డే కెప్టెన్సీ తీసేసిందనే కోపంతో విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో జరగనున్న వన్డే సిరీస్ కు దూరం అవుతున్నాడు అని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల పేరిట తాను ఈ సిరీస్ దూరం కానున్నాడు అని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు అని ఈ భారత టెస్ట్ కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు. Read Also : దాదాకి కోహ్లీ కౌంటర్… కెప్టెన్ గా తప్పుకోవద్దని చెప్పలేదు..! అయితే టీం ఇండియా…
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కి కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ మధ్య బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తప్పించిన తర్వాత గంగూలీ మాట్లాడుతూ… కోహ్లీ మొదట టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలోనే నేను తప్పుకోవద్దు అని చెప్పను. అయిన కోహ్లీ వినలేదు. దాంతో వైట్ బల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్ లు వద్దు అని విరాట్ ను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ…
భారత వన్డే జట్టుకు కాప్టెన్ గా కొనసాగాలి అనుకున్నా… తనను బీసీసీఐ తప్పించింది అనే కోపంతో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే అతను రాబోయే సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల పేరుతో కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై తాజాగా ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు…
సౌత్ ఆఫ్రికా సిరీస్ లో భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. దాంతో ఈ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటిస్తున్న సమయంలోనే రోహిత్ ను భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే…