ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది… దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కన్నుమూశారు.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో…
అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు.. అవమానాలకు గురి చేశారు.. అయినా భరించాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా దూషించారు.. గౌరవాన్ని దెబ్బతీశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ సీఎంగా వస్తానని సవాల్ విసిరి వచ్చేశాను. నేను సీఎంగా ఉన్నాను.. ప్రతిపక్ష నేతగా పని చేశాను. నేనూ మనిషినే.. భార్యకు భర్తనే. నేనెప్పుడూ ఇంట్లో ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు డాక్యుమెంట్లు…
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగిన విధానంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోన్నారు చంద్రబాబు. ఈ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపే అలవాటును కొందరు టీడీపీ నేతలు మానుకోవాలి. నేను చచ్చినా.. నువ్వు చచ్చినా పార్టీ జండా కప్పుతారు ప్రాణాల కోసం వైసీపీ వాళ్ళతో రాత్రిళ్లు మాట్లాడుతారా..!? ఆ అవసరం లేదు అని తెలిపారు. 2014-…
ఆంధ్రప్రదేశ్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టాగా ఉన్న ఇంటి ఆస్తిని ఈ పథకంతో స్థిరాస్తిగా మారుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉపయోగపడుతుందని, అయితే, ఈపథకాన్ని టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించాలని చూస్తుందని ద్వారంపూడి విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని విమర్శించారు. Read:…
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలని మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు, గృహ రుణాలు మాఫీ చేస్తామని ప్రజలను మోసం చేశారని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారని ఆగ్రహించారు. వీరి మోసాలపై కరపత్రాలను విడుదల చేస్తున్నానని…వచ్చే ఎన్నికల్లో టీడీపీలో కొండబాబుకు…
అమరావతి : వైసీపీ నేతలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పినట్లు మేం భావించడం లేదని… చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ క్షమాపణలు నమ్మలేమని మండిపడ్డారు. మాకు వంశీ సారీ కాదు.. చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వంశీ ఇటు సారీ అంటారు.. కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత. వంశీ 5 శాతమే తప్పు చేశారని కొడాలి అనడాన్ని…
ఒక్కసారి మాట జారితే అవి ఎంత దూరం తీసుకెళ్తాయో.. వాటి పర్యవసానాలను ఊహించడం కష్టం. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన ఆ మహిళా నేతల పరిస్థితి అలాగే ఉంది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వారి వెనక ఎవరున్నారన్నది ప్రశ్నే. టీడీపీ మహిళా నేతల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్..! టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైన తర్వాత.. అనంతపురం తమ్ముళ్లు, మహిళా నేతలు ఓ రేంజ్లో అధికారపార్టీపై ఫైర్ అయ్యారు. ఈ…
అమరావతి : సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ దళితులను అన్ని విధాల వంచించారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని నిప్పులు చెరిగారు వర్ల రామయ్య. దారి మళ్లిన సబ్ ప్లాన్ నిధులను తిరిగి ఎస్సీ,…
నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ ఘటనపై నందమూరి కుటుంబ సభ్యులు సైతం భువనేశ్వరికి అండగా నిలబడ్డారు. అయితే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నారా లోకేష్, ఆయన బృందం నాతో నా కుటుంబంపై చేసిన కామెంట్లకు ఎమోషన్లగా ఒక మాట అనబోయి మరో మాట అన్నానన్నారు. అయితే ఈ విషయంలో తాను…
ఇటీవల ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాల్టీల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసినా, పని చేసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొండపల్లి ఎన్నికల్లో ఎంపి కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నేతలను, కార్యకర్తలను ఎంపి నాని బాగా కో-ఆర్డినేట్ చేశారన్న బాబు… సమర్థులైన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ సాంకేతికంగా ఓడినా.. నైతికంగా గెలిచిందన్నారు చంద్రబాబు. అయితే ఇకపై నియోజకవర్గ…