AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS W vs PAK W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా పాకిస్థాన్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 113 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది.
టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ ఖాతా తెరవకుండానే ఔటైనా.. జార్జియా వోల్ 39 పరుగులతో మంచి శుభారంభం అందించింది. ఆ తర్వాత ఎల్లీస్ పెర్రీ (Ellyse Perry) 48 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో 71 పరుగులు చేసింది. చివర్లో నికోలా క్యారీ 13 బంతుల్లో 26 పరుగులతో వేగంగా ఆడటంతో ఆస్ట్రేలియా 199 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
Also Read
- Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
- 7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ మొదటి నుంచే తడబడింది. ఓపెనర్ మునీబా అలీ 32 పరుగులతో పోరాడినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇరామ్ జావేద్ 14, కెప్టెన్ ఫాతిమా సనా 17 పరుగులు చేసినప్పటికీ జట్టును గట్టెక్కించలేకపోయారు. వరుస వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ 13.4 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో నలుగురు బ్యాటర్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్, ఎల్లీస్ పెర్రీ 2 వికెట్లు సాధించారు. జార్జియా వేర్హామ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టడంతో పాటు తన రెండు ఓవర్లలో 11 డాట్ బాల్స్ వేసింది. ఆస్ట్రేలియా తరపున 8 మంది బౌలింగ్ వేయడం విశేషం.
బ్యాటింగ్లో 71 పరుగులు, బౌలింగ్లో 2 వికెట్లు తీసిన ఎల్లీస్ పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ.. 200 పరుగుల మార్క్ను చేరుకోవడమే తమ లక్ష్యమని, ప్రతి సవాలును ఆస్వాదిస్తూ ఆటను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. మరోవైపు వరుసగా నాలుగో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ టోర్నీ నుండి వైదొలిగింది. ఇప్పుడు వారికి నెదర్లాండ్స్తో ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్లో భారత మహిళల జట్టును ఎదుర్కోనుంది.
తాజావార్తలు
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
-
Rakhi Sawant: నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు?.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన రాఖీ సావంత్ ..
-
Team India-BCCI: టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!