Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
- ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన
- తొక్కిసలాటలో అభిమానులకు తీవ్ర గాయాలు
- ప్రవేశానికి ఒక్క గేట్ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede Scare at Ranchi Stadium: ఐపీఎల్ 2025 ఫైనల్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ట్రోఫీని గెలుచుకోవడంతో.. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషాదకర సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అలాంటి ఘటనే దేశంలో మరొకటి చోటుచేసుకుంది. ఝార్ఖండ్ టీ20 లీగ్ 2026 ఫైనల్ సందర్భంగా రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట తొక్కిసలాట చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో కొందరు అభిమానులు గాయపడ్డారు. పోలీసులు క్షగాత్రులను సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో మంగళవారం (జూన్ 23) జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్పూర్ రాయల్స్ తలాడ్డాయి. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే ప్రేక్షకుల ప్రవేశానికి వెస్ట్ గేట్ మాత్రమే తెరిచి ఉంచడంతో.. భారీ రద్దీ ఏర్పడింది. అదే సమయంలో భద్రతా తనిఖీలు నెమ్మదిగా సాగడంతో బయట వేచి ఉన్న అభిమానుల్లో అసహనం పెరిగింది. దీంతో ఒక్కసారిగా తోపులాట, నెట్టుకొనే పరిస్థితి ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
గేట్ వద్ద అభిమానులు ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలో కొందరు కిందపడిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల ఒత్తిడికి స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, గేట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదనపు భద్రతా బలగాలను మోహరించి.. అభిమానులను వరుసగా స్టేడియంలోకి అనుమతించారు. దీంతో కొద్దిసేపటికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అనంతరం ఫైనల్ మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరిగింది.
ఈ ఘటనపై రాంచీ ఎస్ఎస్పీ రాకేశ్ రంజన్ మాట్లాడుతూ.. ‘అభిమానుల ప్రవేశానికి ఒక్క గేట్ మాత్రమే తెరిచి ఉండటంతో భారీ రద్దీ ఏర్పడింది. సెక్యూరిటీ తనిఖీల కారణంగా ఏంటి ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. కొందరు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది’ అని తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు కమల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో రావడం వల్ల తాత్కాలికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, అయితే భద్రతా సిబ్బంది సహకారంతో వెంటనే అదుపులోకి తీసుకువచ్చామని చెప్పారు. గాయపడిన వారిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటన మరోసారి మైదానాల వద్ద ప్రేక్షకుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తింది.
తాజావార్తలు
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!