వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలన కారణంగా రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 1040 ఎత్తిపోతల పథకాలకు కనీసం మరమ్మతులు చేపట్లేదని విమర్శించారు. అందుచేత సగం ఎత్తిపోతల పథకాలు మూలం పడ్డాయని అన్నారు.
ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు ఆర్కే రోజా.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు
రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలన్నారు. ఎప్పుడైనా మామిడిని రైతుల వద్ద నుండి వైసీపీ కొనిందా?, గిట్టుబాటు ధర ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రెండు సార్లు తమ ప్రభుత్వమే మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చింది అని చెప్పారు. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు…
ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తయిపోయింది. ఈ టైంలో అమలైన హామీలు, జరిగిన పనుల గురించి విస్తృత చర్చ మొదలైంది రాష్ట్రంలో. ఆ చర్చ దిశగానే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. అయితే... రాజకీయంగా చూసుకుంటే... ఇది కూటమి పార్టీల మధ్య బాగా సున్నితమైన అంశంగా మారుతున్న సౌండ్ వినిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలిచ్చింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టి సారించింది.
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్ టాపిక్. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్.
సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు అని…
విజయవాడ సబ్ జైల్ దగ్గర ఆయనకు స్వాగతం పలికిన మాజీ మంత్రి పేర్నినాని.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. వల్లభనేని వంశీ అరెస్ట్ సునకానంద చర్యగా పేర్కొన్నారు.. ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్ని కేసులు పెట్టి.. ఇలా వేధించినా.. వల్లభనేని వంశీ మాత్రం గన్నవరం వదిలి పారిపోడు అని స్పష్టం చేశారు.. వంశీ గన్నవరంలోనే ఉంటాడని పేర్కొన్నారు..
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.