కేంద్ర కేబినెట్లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతోంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పరివేక్షిస్తున్నారు. ఈనెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికైన 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు – రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పరిటాల సునీత, సింగనమల బండారు శ్రావణి, పుట్టపర్తికి చెందిన పల్లె సింధూర, పెనుకొండ అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన సవిత ఉన్నారు. వీరిలో ముగ్గురు బండారు శ్రావణి, పల్లె సింధూర, సవిత తొలిసారి ఎమ్మెల్యేలు. బండారు శ్రావణి, మొదటిసారిగా ఎన్నికైనప్పటికీ, 2014 , 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విఫలమయ్యారు. ఆమె పట్టుదల , సహనం ఫలించాయి,…
నేడు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ క్యాబినెట్లో ఈసారి ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకుంది. అయితే, ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కనుంది. కేంద్రమంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ నేతలకు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. అది ఎవరో తెలియాలి అంటే కింది వీడియో క్లిక్ చేసి చుడండి.
అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణాలకు తెగబడ్డారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసిన నమూనా, ఇంటితోపాటు స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని అలాగే శిలాఫలకాన్ని జెసిబితో ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నేపద్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు…
చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 2019 ఎన్నికల తర్వాతనే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఆవరణంలో కొత్తగా ఏర్పాటు చేసిన గార్డెన్ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. Tirumala : కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 10 గంటలు.. 2019 ఎన్నికల కంటే…
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 09:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంలో ట్వీట్ చేసింది.
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
TDP-JDU: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుపుతో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2014, 2019లో కాకుండా ఈ సారి మ్యాజిక్ఫిగర్(272)ని బీజేపీ స్వతహాగా సాధించలేకపోయింది.