Margani Bharat: వారిపై చర్యలు తీసుకొండి.. పోలీసులకు మాజీ ఎంపీ ఫిర్యాదు
- తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్
- రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు
- అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పోలీసులను కోరారు.. రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ పుటేజీ, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఈ సందర్భంగా మాజీ ఎంపీ అందజేశారు. సీతంపేట మూలగొయ్యికి చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారని, బాధితుని తలకు నాలుగు కుట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Noor Malabika: నూర్ మరణంపై మౌనం వీడిన కుటుంబ సభ్యులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
Also Read
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని భరత్ కోరారు. పోలీసులు తగు చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నానని, న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాజీ ఎంపీ భరత్ చెప్పారు. ఇటువంటి దాడులు మళ్లీ మళ్లీ నగరంలో జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదన్నారు. రాజమండ్రి నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నదే తమ అభిలాష అన్నారు. క్రమ శిక్షణ గల పార్టీ అని చెప్పే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్భలంతోనే మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారందరి పేర్లూ అడిషనల్ ఎస్పీకి అందజేశామన్నారు. టీడీపీ క్రమశిక్షణ ఇదేనా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ భరత్.
తాజావార్తలు
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
-
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!