నేడు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ క్యాబినెట్లో ఈసారి ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకుంది. అయితే, ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కనుంది. కేంద్రమంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ నేతలకు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. అది ఎవరో తెలియాలి అంటే కింది వీడియో క్లిక్ చేసి చుడండి.
అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణాలకు తెగబడ్డారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసిన నమూనా, ఇంటితోపాటు స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని అలాగే శిలాఫలకాన్ని జెసిబితో ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నేపద్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు…
చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 2019 ఎన్నికల తర్వాతనే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఆవరణంలో కొత్తగా ఏర్పాటు చేసిన గార్డెన్ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. Tirumala : కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 10 గంటలు.. 2019 ఎన్నికల కంటే…
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 09:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంలో ట్వీట్ చేసింది.
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
TDP-JDU: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుపుతో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2014, 2019లో కాకుండా ఈ సారి మ్యాజిక్ఫిగర్(272)ని బీజేపీ స్వతహాగా సాధించలేకపోయింది.
ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి కొడాలి నాని.. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. వైసీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
Loksabha Elections 2024 : దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పోరు మొదలైంది. ఈసారి బీజేపీ, ఇండియా కూటమి ఏదీ మెజారిటీ మార్కును దాటలేకపోయింది.
Ys Jagan Tweets about Situation in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది, టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది అని ఆరోపించిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు…