Lok sabha: ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఎన్నిక!
- ఈనెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
- ఈనెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక
- స్పీకర్ పోస్టుపై కన్నేసిన టీడీపీ.. జేడీయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త స్పీకర్ ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్ను నియమించనున్నారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఈనెల 26న కొత్త స్పీకర్ ఎంపిక జరగనుంది. అటు తర్వాత సమావేశాలు జూలై 3 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: UGC: యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు..యూజీసీ సంచలన నిర్ణయం..
Also Read
ఇదిలా ఉంటే లోక్సభ స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ కూటమిలో గట్టి పోటీ నెలకొంది. ఈ పోస్టుపై జేడీయూ కన్నేసింది. స్పీకర్ పోస్టు తమకు ఇవ్వాలంటూ నితీష్ కుమార్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు కూడా ఉన్నట్లు సమాచారం. స్పీకర్ పోస్టు టీడీపీకి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ పోస్టు మాత్రం తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ కూడా భావిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో మోడీ సర్కార్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ స్పీకర్ పోస్టు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఇది కూడా చదవండి: Amit Shah and Chandrababu Meeting: రాత్రికే ఏపీకి అమిత్షా.. చంద్రబాబుతో కీలక భేటీ
ఇదిలా ఉంటే ఆదివారం మోడీ 3.0 సర్కార్ ఏర్పడింది. 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే మంత్రులకు సోమవారం శాఖలు కూడా కేటాయించారు. పాత మంత్రులకు పాత శాఖలే కేటాయించడం విశేషం.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!