అమరావతిలో ఈరోజు మద్యాహ్నం 12 గంటలకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి చర్చిస్తారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం కోసం ఉదయం 11 గంటలకు సీఎం సచివాలయంకు చేరుకుంటారు. ఈ నెల 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం,…
రాజకీయ లబ్ధి పొందటం కుదరదు.. రేషన్ బియ్యం కేసులో సూత్రధారి పేర్ని నాని.. ఈ కేసు నుంచి తప్పించుకోలేడని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. గోడౌన్ ప్రారంభం చేసింది పేర్ని భార్య కాదన్నారు.. ఆడవాళ్ళ గౌరవాల గురించి ఇప్పుడు పేర్ని నాని చెప్పటం విడ్డూరంగా ఉంది.. నారా భువనేశ్వరి గురించి సభలో మాట్లాడినపుడు నీ గుణం ఏమైంది నువ్వు ఎక్కడ సచ్చావ్ అంటూ మండిపడ్డారు.
Jc Prabhakar Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు.
Botsa Satyanarayana : విద్యుత్ చార్జీలపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత ను చూసైనా ప్రభుత్వం వెనక్కు తగ్గాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను పక్కనబెట్టిన ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందన్నారు. జనవరి 3న జరగాల్సిన వసతి దీవెన ఆందోళనలను పరీక్షల నేపథ్యంలో జనవరి 29కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆరునెలల్లో లక్ష కోట్లు అప్పు చేసిందన్నారు బొత్స సత్యనారాయణ. ఈ స్థాయిలో అప్పులు చేసి…
Nara Lokesh : సామాజిక మాధ్యమం ఎక్స్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మంత్రి నారాలోకేష్ ఆశక్తి కర ట్వీట్ చేశారు. భారతదేశం మన్మోహన్ సింగ్ అస్తమయంపై శోకసంద్రంలో మునిగిన సమయంలో ఆయన మా కుటుంబం పట్ల చూపిన ప్రేమను గుర్తు చేసుకోవాలంటూ నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ‘2004 మాకు పరీక్షా సమయం. అప్పడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్నికోల్పోయింది.. చంద్రబాబు నాయుడుపైనా ఆ ఎన్నికల ముందే భయంకరమైన దాడి అలిపిరి ఘటన…
బొత్స సత్యనారాయణ.... లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ప్రస్తుతం ఇదే పొలిటికల్ హాట్. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ వెలుగు వెలిగిన నేత. రాజకీయ విమర్శలను సైతం తూకం వేసినట్టు చేసే బొత్సకు 2024 ఎన్నికలు చేదు అనుభవం మిగిల్చాయి. కంచుకోట లాంటి చీపురుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కళా వెంకట్రావ్ చేతుల్లో ఓడిపోయారాయన.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచినా విధానాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రధానితో కుదుర్చుకున్న ఒప్పందాలనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందన్నారు. దానిలో భాగంగానే గతంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన నారా లోకేష్.. నేడు వాటిని బిగించాలని చెప్పటం సిగ్గుచేటని శ్రీనివాస రావు మండిపడ్డారు.
పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయ్యింది.. ఈ నెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.. అనంతరం కోటప్పకొండ త్రికోటేస్వర స్వామిని దర్శించుకోనున్నారు.. ఈ నేపథ్యంలో యల్లమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు..
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై జగన్ ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే అని, సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారని…
కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్రుల పెర్ఫార్మెన్సుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే మంత్రులకు మార్కులు ఇచ్చారు. ఎవరి పనితీరు ఏ రకంగా ఉంది అనే ఒక అంచనా కూడా వేశారు సీఎం చంద్రబాబు. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు మంత్రులకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.