Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి
- టీడీపీ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు.
- అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామన్న కాకాణి.
- అరెస్టు చేసి జైలులో పెట్టినా.. ఆక్కడ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానాన్న మాజీ మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ తీరును, ముఖ్యంగా ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్.పి. తన విధులకు కాస్త దూరంగా ఉంటున్నాడని, వెంకటాచలం మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్య యాదవ్ పై శ్రావణి అనే మహిళ ఫిర్యాదు చేయించి తప్పుడు కేసు నమోదు చేయించారన్నారు. ఆ కేసులో శ్రావణి తన వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు పేర్కొందని తెలిపారు. కానీ, మెటీరియల్ ఏవిడెన్స్ ఉందని చెబుతూ.. మళ్లీ ఆ రిమాండ్ రిపోర్ట్ ను మార్చి తీసుకెళ్లారని అన్నారు. కొవ్వురూలో స్టాంపు వెండర్ లోక్ నాథ్ సింగ్ నుంచి కొనుగోలు చేశారని ఆయన అన్నారు.
Also Read: Nimmala Rama Naidu: ప్రజలను జగన్ మోసం చేశారన్న మంత్రి నిమ్మల
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ఆయన పాత తేదీని వేసి స్టాంప్స్ ను శ్రావణికి విక్రయించారని, తేదీలు మార్చినట్లు కోవూరు సబ్ రిజిస్ట్రార్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరాలు ఉన్నాయని అన్నారు. న్యాయ వ్యవస్థను పోలీసులు తప్ప దోవ పట్టించారన్నారు. జిల్లా ఎస్.పి. విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి రాకుండానే నివేదిక ఇచ్చారని అన్నారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు భయపడరని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామని అన్నారు. సోమిరెడ్డి చేసిన అవినీతిని వెంకట శేషయ్య ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అన్నారు. నాపై వేదయపాలెం స్టేషన్ లో ఒక కేసు పెట్టారని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడనన్నారు. 2029 వరకూ నన్ను అరెస్టు చేసి జైలులో పెట్టినా.. ఆక్కడ నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తా అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!