CM Chandrababu: సీఎం పదవి జాక్పాట్ కాదు.. దానికి వెనుక ఎంతో కష్టం ఉంది!
- కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
- స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరించిన సీఎం
- కష్టపడితే జీవితంలో పైకి వస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు సీఎం పదవి జాక్పాట్ కాదని, దానికి వెనుక ఎంతో కష్టం ఉందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరైనా సరే కష్టపడితే జీవితంలో పైకి వస్తారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటికీ నుండి కుప్పంలో పసుపు జెండానే ఎగిరిందని, కుప్పం ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈ స్వర్ణ కుప్పం విజన్ తీసుకొచ్చానన్నారు. 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైసీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని సీఎం మండిపడ్డారు. 2027 నాటికి ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ తొలి రెండు స్దానాల్లో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘గత ఐదు ఏళ్లుగా వైసీపీ విధ్వంస పాలన సాగించింది. రాష్ట ఆర్ధిక పరిస్థితిని నాశనం చేశారు. వైసీపీ పార్టీ నాయకులు ప్రజలను భయపెట్టి అనిచివేశారు. పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 1995లో విజన్ 20-20 రూపొందించాను. అప్పట్లో రకరకాల మాటలు అన్నారు కాని నేను చెప్పిందే నిజమైంది. ద్రావిడ వర్శిటి ఎర్పాటు చేసినా ఘనత ఎన్టీఆర్ గారిది. విశ్వవిద్యాలయాలను సైతం వైసీపీ తన రాజకీయలకు వాడుకుంది’ అని ఫైర్ అయ్యారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
‘2027 నాటికి ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ మొదటి రెండు స్దానాల్లో ఉంటుంది. ఇంగ్లీషు మన జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాము. గత 25 సంవత్సరాలలో హైదరాబాద్ ఒక మహానగరంగా మారింది. తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆనాడు నేను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రం అప్పుల ఊబిలో పడింది. కుప్పానికి రాబోయే ఐదేళ్లులో ఏమి చేస్తానో ముందుగానే ఒక విజన్ ప్రకటిస్తున్నా. కష్టపడితే జీవితంలో పైకి వస్తారు. నాకు సీఎం పదవి జాక్పాట్ కాదు.. దానికి వెనుక ఎంతో కష్టం ఉంది. పార్టీ పెట్టినప్పటికీ నుండి ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. కుప్పం ప్రజలు వరుగా నన్ను గెలిపించారు. వారి రుణం తీర్చుకోవడానికి ఈ స్వర్ణ కుప్పం విజన్’ అని సీఎం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!