YS Jagan: కూటమి ప్రభుత్వానికి జగన్ సూటి ప్రశ్నలు
- సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి
- కూటమి ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన జగన్.
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైయస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన కూటమి సర్కార్ను నిలదీస్తూ తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు. ఇక ఆ సందేశంలో పలు అంశాలపై సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏముందంటే..
చంద్రబాబు నాయుడు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అని సూటిగా ప్రశ్నించారు. మీ పార్టీ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. కానీ, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని కూడా ఆపేశారని జగన్ అన్నారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నా కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో కచ్చితంగా చెప్పలేదంటూ తెలిపారు. చివరికి, ఈ ఏడాదికి అసలు ఇవ్వమని కేబినెట్ లో తేల్చిచెప్పేశారని, ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అంటూ జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఒక్కరోజే 15 వికెట్లు
ఇక ముఖ్యంగా ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదని, ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు.. అన్నారని.. ఇద్దరుంటే రూ.30వేలు.. ముగ్గురు ఉంటే రూ.45వేలు.. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారని జగన్ తెలిపారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయని ఆయన అన్నారు. మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే పిల్లలు, వారి తల్లులు ఈ 7-8 నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారని జగన్ అన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లుతూ.. ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారన్నారంటూ మండి పడ్డారు.
మరోవైపు, రైతు భరోసా తీరు కూడా అలాగే ఉందని.. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా డబ్బులు ఇవ్వకుండా గడిపేశారని అన్నారు. అదిగో.. ఇదిగో.. అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదని జగన్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ. 20వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది.. రబీ కూడా అయిపోయింది.. ఒక్కపైసా ఇవ్వలేదని అని జగన్ అన్నారు. సంక్షోభం సమయంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా.. కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదని టీడీపీ ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు.
Also Read: Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి
1.@ncbn గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?
2.అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2025
మొత్తంగా.. ప్రతి పిల్లాడికి రూ. 15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 20వేలు ఇస్తామన్నది మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ. 18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ. 36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది కూడా మోసమే అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోందని, ప్రతి అడుగులోనూ స్కాంలే అని జగన్ అన్నారు. రోజులు గడుస్తున్నకొద్దీ, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయని, ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయని ఆయన అన్నారు. ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుందని ఆయన తన సుదీర్ఘ పోస్టులో తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో