Pakistan vs New Zealand: పాకిస్థాన్ కొంప ముంచిన వర్షం.. న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. ఇక ఇదే లాస్ట్ ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs New Zealand: వర్షం పాకిస్థాన్ కొంప ముంచింది. శనివారం శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన పాకిస్థాన్ vs న్యూజిలాండ్ టీ20 వరల్డ్ సూపర్ ఎయిట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే సైతం లేదు. దీంతో చేసేదేమి లేక రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. వర్షం కారణంగా ఇరు దేశాలకు గడ్డు కాలంగా మారింది. సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. పాకిస్థాన్ ఇప్పుడు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్, శ్రీలంకలతో పాక్ పోటీ పడాల్సి ఉంది. సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని జట్టు ఈ రెండు మ్యాచ్ల్లో గెలిస్తే మొత్తం 5 పాయింట్లతో సెమీఫైనల్కు చేరే అవకాశాలు బలంగా ఉంటాయి. ఒకటి గెలిచి, ఒకటి ఓడితే 3 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్లూ ఓడిపోతే పాకిస్థాన్ ఇంటి బాట పట్టాల్సిందే.
READ MORE: Healthy Protein Snacks: శెనగపిండి లేని హెల్తీ ప్రోటీన్ పకోడీ.. ఇలా ‘సింపుల్’గా చేసుకోండి!
Also Read
- Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
అయితే.. నేడు స్వల్పంగా వర్షం పడుతుండగా టాస్ ముగిసింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ తేలికపాటి జల్లులు క్రమంగా భారీ వర్షంగా మారడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ తమ జట్టులో ఒక మార్పు సైతం చేసింది. ఖవాజా నఫాయ్ స్థానంలో ఫఖర్ జమాన్ను తుదిజట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెనడాతో జరిగిన మ్యాచ్ను అనారోగ్యం కారణంగా మిస్ చేసిన కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తిరిగి జట్టులో చేరాడు. అతనితో పాటు లాకీ ఫర్గూసన్, ఇష్ సోధీకి కూడా అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో పాకిస్థాన్ డీలా పడింది. ఇక ఫిబ్రవరి 24న ఇదే వేదికలో ఇంగ్లాండ్తో, ఫిబ్రవరి 25న న్యూజిలాండ్ను దాయాది జట్టు ఎదుర్కోనుంది. దాయాది జట్టు ఇంటికి పయనమవుతుందా? రెండు మ్యాచ్లు గెలిచి సెమీస్ ఆడుతుందా? అనే అంశంపై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
-
Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !
-
Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!