Rahul Gandhi: ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా గుణపాఠాలు నేర్చుకోరా..
- తమిళనాడులో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన భాగమతి ఎక్స్ప్రెస్..
- ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు..
- ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలో భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటన బాలాసోర్లో గూడ్స్ రైలును, ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనకు ప్రతిరూపంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘మైసూర్- దర్బాంగా రైలు ప్రమాదం భయంకరమైన బాలాసోర్ ఘటనకు అద్దం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఆ ప్రమాదంలో ఒక ప్యాసింజ్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టగా.. పలుమార్లు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా గుణపాఠాలు నేర్చుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం పైస్థాయి నుంచే ఉండాలన్నారు. ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి? అని రాహుల్ గాంధీ విమర్శించారు.
Read Also: Erracheera The Beginning: రాజేంద్రప్రసాద్ మనుమరాలు నటించిన ఎర్రచీర.. డిసెంబర్ 20న విడుదల
Also Read
- CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
- CM Vijay: పోలీసులు పవర్ సెంటర్గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
- HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
- PM Modi: పారిస్లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
అయితే, మైసూర్ నుంచి దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తమిళనాడు సర్కార్ వెల్లడించింది. రైలు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 22 ఆంబులెన్స్లు సంఘటన ప్రదేశానికి చేరుకున్నాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఇతర ప్రయాణికులకు మూడు కల్యాణ మండపాల్లో బస ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా రైలు ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ కోరారు.
The Mysuru-Darbhanga train accident mirrors the horrific Balasore accident—a passenger train colliding with a stationary goods train.
Despite many lives lost in numerous accidents, no lessons are learned. Accountability starts at the top. How many more families must be… https://t.co/ggCGlgCXOE
— Rahul Gandhi (@RahulGandhi) October 12, 2024
తాజావార్తలు
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!