Chennai Air Show: చెన్నైలో ఎయిర్ షో వివాదం.. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం..!
- చెన్నైలో జరిగిన ఎయిర్ షోలో ఐదుగురు మృతి.. 200 మందికి గాయాలు..
- డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు..
- రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి: మంత్రి సుబ్రమణ్యన్
Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు. అందులో దాదాపు రెండు వందల మంది రికవరీ అయ్యి.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున అధికార- విపక్షాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇక, ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇక, విపక్షాల విమర్శలపై మంత్రి సుబ్రమణ్యన్ స్పందిస్తూ.. ఎయిర్ షోకు అన్ని ఏర్పాట్లు చేశామని 7500 మంది పోలీసులతో భద్రత తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు మాపై ఆరోపణలు చేస్తుందన్నారు.. డీహైడ్రేషన్ కు గురైన వారందరూ పూర్తిగా కోరుకున్నారని మంత్రి సుబ్రమణ్యన్ వేడుకున్నారు. మరోవైపు, చెన్నైలోని మెరినా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షో ఘటనలో ఐదుగురు మృతి చెందడం చాలా బాధాకరం అని డీఎంకే పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి అన్నారు. నిర్వహించలేని సమావేశాలను ఎందుకు చేపట్టడం అంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
కాగా, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా డీఎంకే పార్టీ మీటింగ్ నిర్వహించారని మాజీ మంత్రి జయకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల మంది ప్రజలకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు అని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ సింబల్ కనబడేలా డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్ ఎలా టీ షర్టు ధరిస్తాడు అని ప్రశ్నించారు. చొక్కా కొనుక్కునే దానికి డబ్బులు లేకపోతే మా పార్టీ నుంచి డిప్యూటీ సీఎంకు ఒక చొక్కా కొనిస్తామన్నారు. 2003లో జరిగిన ఎయిర్ షోకి 10 లక్షల మంది వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పటి సీఎం జయలలిత ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. తమిళనాడు పరువు తీయొద్దండి పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి అని మాజీమంత్రి జయకుమార్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!