Chennai Air Show: చెన్నైలో ఎయిర్ షో వివాదం.. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం..!
- చెన్నైలో జరిగిన ఎయిర్ షోలో ఐదుగురు మృతి.. 200 మందికి గాయాలు..
- డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు..
- రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి: మంత్రి సుబ్రమణ్యన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు. అందులో దాదాపు రెండు వందల మంది రికవరీ అయ్యి.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున అధికార- విపక్షాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇక, ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ఇక, విపక్షాల విమర్శలపై మంత్రి సుబ్రమణ్యన్ స్పందిస్తూ.. ఎయిర్ షోకు అన్ని ఏర్పాట్లు చేశామని 7500 మంది పోలీసులతో భద్రత తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు మాపై ఆరోపణలు చేస్తుందన్నారు.. డీహైడ్రేషన్ కు గురైన వారందరూ పూర్తిగా కోరుకున్నారని మంత్రి సుబ్రమణ్యన్ వేడుకున్నారు. మరోవైపు, చెన్నైలోని మెరినా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షో ఘటనలో ఐదుగురు మృతి చెందడం చాలా బాధాకరం అని డీఎంకే పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి అన్నారు. నిర్వహించలేని సమావేశాలను ఎందుకు చేపట్టడం అంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
కాగా, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా డీఎంకే పార్టీ మీటింగ్ నిర్వహించారని మాజీ మంత్రి జయకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల మంది ప్రజలకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు అని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ సింబల్ కనబడేలా డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్ ఎలా టీ షర్టు ధరిస్తాడు అని ప్రశ్నించారు. చొక్కా కొనుక్కునే దానికి డబ్బులు లేకపోతే మా పార్టీ నుంచి డిప్యూటీ సీఎంకు ఒక చొక్కా కొనిస్తామన్నారు. 2003లో జరిగిన ఎయిర్ షోకి 10 లక్షల మంది వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పటి సీఎం జయలలిత ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. తమిళనాడు పరువు తీయొద్దండి పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి అని మాజీమంత్రి జయకుమార్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!