Chennai Air Show: చెన్నైలో ఎయిర్ షో వివాదం.. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం..!
- చెన్నైలో జరిగిన ఎయిర్ షోలో ఐదుగురు మృతి.. 200 మందికి గాయాలు..
- డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు..
- రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి: మంత్రి సుబ్రమణ్యన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు. అందులో దాదాపు రెండు వందల మంది రికవరీ అయ్యి.. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై పెద్ద ఎత్తున అధికార- విపక్షాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇక, ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
ఇక, విపక్షాల విమర్శలపై మంత్రి సుబ్రమణ్యన్ స్పందిస్తూ.. ఎయిర్ షోకు అన్ని ఏర్పాట్లు చేశామని 7500 మంది పోలీసులతో భద్రత తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు మాపై ఆరోపణలు చేస్తుందన్నారు.. డీహైడ్రేషన్ కు గురైన వారందరూ పూర్తిగా కోరుకున్నారని మంత్రి సుబ్రమణ్యన్ వేడుకున్నారు. మరోవైపు, చెన్నైలోని మెరినా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షో ఘటనలో ఐదుగురు మృతి చెందడం చాలా బాధాకరం అని డీఎంకే పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి అన్నారు. నిర్వహించలేని సమావేశాలను ఎందుకు చేపట్టడం అంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
కాగా, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా డీఎంకే పార్టీ మీటింగ్ నిర్వహించారని మాజీ మంత్రి జయకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల మంది ప్రజలకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు అని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ సింబల్ కనబడేలా డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్ ఎలా టీ షర్టు ధరిస్తాడు అని ప్రశ్నించారు. చొక్కా కొనుక్కునే దానికి డబ్బులు లేకపోతే మా పార్టీ నుంచి డిప్యూటీ సీఎంకు ఒక చొక్కా కొనిస్తామన్నారు. 2003లో జరిగిన ఎయిర్ షోకి 10 లక్షల మంది వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పటి సీఎం జయలలిత ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. తమిళనాడు పరువు తీయొద్దండి పరిపాలన చేతకాకపోతే తప్పుకోండి అని మాజీమంత్రి జయకుమార్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!