Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా గన్నవరం నియోజకవర్గంలోని డెల్టా ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత రైతులకు కూడా సాగునీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత 11 ఏళ్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. 2015లో తాను గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరం కుడి కాల్వ సమీపంలోని మెట్ట ప్రాంత గ్రామాలకు కూడా నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని లేఖ ద్వారా గుర్తు చేశారు వంశీ..
దీంతో తన సొంత ఖర్చులతో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో మొత్తం 36 ప్రాంతాల్లో 500కుపైగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు, చెరువులకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు నిరంతరంగా మెట్ట ప్రాంతాలకు పట్టిసీమ నీరు అందించగలిగామని పేర్కొన్నారు వల్లభనేని.. అయితే ఈ ఏడాది నీటిపారుదల అధికారులు, పోలీసులు బందోబస్తుతో మోటార్లను నిలిపివేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, అనంతరం జగన్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించాయని గుర్తుచేస్తూ, ప్రస్తుతం కూడా రైతుల ప్రయోజనాల దృష్ట్యా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్..
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
తాజావార్తలు
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!