Supreme Court: చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి సుప్రీం షాక్.. తాజా ఆదేశాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే అధికారి తీరుపై చీవాట్లు పెట్టింది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తింది. తాజాగా మంగళవారం కూడా రిటర్నింగ్ అధికారి తీరుపై సుప్రీం (Supreme Court) మండిపడింది.
సోమవారం చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాలపై వేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మంగళవారం బ్యాలెట్ పత్రాలతో హాజరుకావాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశించింది. ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు… చెల్లని 8 ఓట్లను రీకౌంటింగ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో చెల్లని బ్యాలెట్ పత్రాలను మంగళవారం సుప్రీంకోర్టు పరిశీలించింది. చెల్లని 8 ఓట్లను తిరిగి లెక్కించాలని పేర్కొంది. 8 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు అనుకూలంగా ఉన్నాయని ధర్మాసనం గమనించింది. దీంతో ఆప్ అభ్యర్థే మేయర్ అంటూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బ్యాలెట్ పత్రాలను తమ ముందు సమర్పించాలని రిటర్నింగ్ అధికారికి సోమవారం కోర్టు ఆదేశించింది. ఈరోజు వాటిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. బ్యాలెట్లను న్యాయవాదులు పరిశీలించారు. 8 ఓట్లు కూడా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు పడ్డాయి. కానీ రిటర్నింగ్ అధికారి మాత్రం 8 ఓట్లు చెల్లనివిగా అడ్డగీతలు వేశారు. అనంతరం బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. దీంతో ఆప్-కాంగ్రెస్ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి చీవాట్లు పెట్టింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ బీజేపీ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆప్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లను బీజేపీలో చేర్చుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆప్, కాంగ్రెస్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!