Supreme Court: చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి సుప్రీం షాక్.. తాజా ఆదేశాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే అధికారి తీరుపై చీవాట్లు పెట్టింది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తింది. తాజాగా మంగళవారం కూడా రిటర్నింగ్ అధికారి తీరుపై సుప్రీం (Supreme Court) మండిపడింది.
సోమవారం చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన అక్రమాలపై వేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మంగళవారం బ్యాలెట్ పత్రాలతో హాజరుకావాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశించింది. ఈరోజు విచారణ చేపట్టిన కోర్టు… చెల్లని 8 ఓట్లను రీకౌంటింగ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
వివాదాస్పదమైన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో చెల్లని బ్యాలెట్ పత్రాలను మంగళవారం సుప్రీంకోర్టు పరిశీలించింది. చెల్లని 8 ఓట్లను తిరిగి లెక్కించాలని పేర్కొంది. 8 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు అనుకూలంగా ఉన్నాయని ధర్మాసనం గమనించింది. దీంతో ఆప్ అభ్యర్థే మేయర్ అంటూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బ్యాలెట్ పత్రాలను తమ ముందు సమర్పించాలని రిటర్నింగ్ అధికారికి సోమవారం కోర్టు ఆదేశించింది. ఈరోజు వాటిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. బ్యాలెట్లను న్యాయవాదులు పరిశీలించారు. 8 ఓట్లు కూడా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు పడ్డాయి. కానీ రిటర్నింగ్ అధికారి మాత్రం 8 ఓట్లు చెల్లనివిగా అడ్డగీతలు వేశారు. అనంతరం బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. దీంతో ఆప్-కాంగ్రెస్ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి చీవాట్లు పెట్టింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ బీజేపీ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆప్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లను బీజేపీలో చేర్చుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆప్, కాంగ్రెస్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!