Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ మేరకు అతడు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం వీళ్లిద్దరూ డిన్నర్కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఏదో ఉందని గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం కెరీర్లో ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో సారా అలీఖాన్తో డేటింగ్ అంశంపై ప్రశ్నించగా…
Formula E-Racing: దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్కు సర్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ లీగ్లో భాగంగా నవంబర్ 19, 20 తేదీల్లో స్ట్రీట్ సర్క్యూట్ రేస్ ప్రారంభ ఎడిషన్ నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్పై ట్రయల్ రేసును నిర్వహిస్తారు. అయితే ఈ రేసింగ్ను చూసేందుకు ఆసక్తి ఉన్న క్రీడాభిమానుల కోసం టిక్కెట్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందుకోసం సాధారణ…
Ramiz Raja: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన అనూహ్యంగా సెమీస్ బెర్త్ కైవసం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్కు చేరింది. అయితే మరో సెమీస్లో భారత్ ఓడిపోయి ఇంటిముఖం పట్టడంపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నాడు. టీమిండియా, బీసీసీఐని అవహేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ల ఆటగాళ్లు ఉన్న టీమ్ ఇంటికెళ్లిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. గత నెలలోనే…
BCCI: టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెమీస్లో ఇంగ్లండ్పై ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలతో త్వరలో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరితో భవిష్యత్ టీ20 జట్టుపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే టీ20లకు హార్దిక్ పాండ్యాను సారథిగా చేయడంతో పాటు టాలెంట్ ఉన్న కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే…
Pakistan Record: టీ20 ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్పై గెలిచి పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. ఒక జట్టుపై అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్పై పాకిస్తాన్కు ఇది 18వ విజయం. ఇన్ని మ్యాచ్ల్లో మరే జట్టు ప్రత్యర్థిపై గెలుపొందలేదు. ఇప్పటివరకు పాకిస్థాన్పై 17 మ్యాచ్ల్లో గెలిచిన రికార్డు ఇంగ్లండ్పై ఉంది. శ్రీలంక, వెస్టిండీస్పై కూడా భారత్ 17 మ్యాచ్ల్లో గెలిచింది. ఇప్పుడు ఆ జట్లను పాకిస్థాన్ అధిగమించి సరికొత్త రికార్డును తన…
IPL 2023: గత రెండేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మెగా టీ20 లీగ్ను విదేశాల్లో నిర్వహించారు. అయితే వచ్చే ఏడాది ఇండియాలోనే ఐపీఎల్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు మినీ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేలంలో పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. దీని కోసం ఒక్కో ఫ్రాంచైజీకి అదనంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన మెగా వేలంలో మిగిలిపోయిన మొత్తం ఈ రూ.5 కోట్లకు అదనం. ఐపీఎల్…
Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్లో భాగంగా ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్లో టీమిండియాను ఓడిస్తామని…
T20 World Cup: క్రికెట్లో న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. గ్రూప్ స్టేజీలో దుమ్మురేపేలా ఆడతారు. నాకౌట్ మ్యాచ్లలో మాత్రం చేతులెత్తేస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఒక ఫోబియా ఉంటే.. న్యూజిలాండ్ జట్టుకు మరో ఫోబియా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్.. ఇలా మూడు ప్రపంచకప్లలోనూ న్యూజిలాండ్ బోల్తా కొట్టింది. దీంతో పాపం న్యూజిలాండ్ అనిపించక మానదు. పలువురు అభిమానులు అయ్యో…
Roger Binny: టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు ఐసీసీ సహరిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన అఫ్రిది వ్యాఖ్యలపై పెదవి విప్పారు. అఫ్రిది చేసిన ఆరోపణలు సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదని.. ఐసీసీ అన్ని జట్ల విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఐసీసీ పక్షపాతం…