Team India: రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్.. ఫెంటాస్టిక్ ఫైవ్ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: కొత్త ఏడాదిలో టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కాబోతోంది. శ్రీలంకతో టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ముంబై వేదికగా తొలి టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ శ్రీలంకతో టీ20 సిరీస్కు ఫెంటాస్టిక్ ఫైవ్ సిద్ధమని ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో చాహల్తో పాటు అర్ష్దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ ఉన్నారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ సిరీస్కు దూరంగా ఉండగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ జట్టు బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
Read Also: Sridhar Reddy: తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం
Also Read
- ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
- ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
కాగా మూడు టీ20ల సిరీస్లో తొలి టీ20 ముంబైలో, రెండో టీ20 ఈనెల 5న పూణె వేదికగా, మూడో టీ20 ఈనెల 7న రాజ్కోట్ వేదికగా జరగనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, శ్రీలంక జట్లు ముంబై చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. సోమవారమే టీమిండియా ఆటగాళ్లంతా ముంబై చేరుకోగా మంగళవారం జోరుగా ప్రాక్టీస్ చేశారు. యువ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ నెట్స్లో చెమటోడ్చారు. అనంతరం కొత్త స్పాన్సర్ ఎంపీఎల్ జెర్సీ ఫొటో షూట్లో పాల్గొన్నారు.
Fantastic five 😎
All set for the T20I series 🇮🇳#TeamIndia | #INDvSL pic.twitter.com/pAWq28wkF7— Yuzvendra Chahal (@yuzi_chahal) January 2, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?