బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బీజేపీ కి రాజీనామా చేశా. రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి…
ఆదివాసి జాతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తనపై లేనిపోనివి వక్రీకరించి తుడుం దెబ్బ నాయకులు నిందారోపణలు చేయడం శోచనీయమని ఎంపీ సోయం బాపురావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ నుండి ఎంపీ పత్రిక ప్రకటన విడుదల చేశారు. breaking news, latest news, telugu news, big news, soyam bapu rao,
తాను ఎంపీ లాడ్స్ నిధులతో ఇల్లు కట్టాను, పెళ్లి చేశాను అనేది అవాస్తవమన్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను అలా అనలేదని.. రమేష్ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు శంకర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధులు క్యాడర్ కు ఇస్తే పార్టీకి క్యాడర్ కు తనకు పేరు వచ్చింది కనుక ఆ నేతలు ఇలా కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. నిన్న బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, రాథోడ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆమె.. సీఎం కేసీఆర్, కవితపై నోరు జారితే నాలుక కోస్తాం జాగ్రత్త బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. దుబాయి గురించి మాట్లాడుతున్నావ్.. నేను 25 దేశాలకు వెళ్లాను.. స్వయంగా ప్రభుత్వమే నన్ను అమెరికాకు పంపించి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న.. ఒళ్లు…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని,…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్ అన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మానసిక క్షోభకు…