Rekha Naik: బీజేపీ నేతలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్.. నోరు జారితే నాలుక కోస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. నిన్న బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు, రాథోడ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆమె.. సీఎం కేసీఆర్, కవితపై నోరు జారితే నాలుక కోస్తాం జాగ్రత్త బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. దుబాయి గురించి మాట్లాడుతున్నావ్.. నేను 25 దేశాలకు వెళ్లాను.. స్వయంగా ప్రభుత్వమే నన్ను అమెరికాకు పంపించి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. మహిళలపై మాట్లాడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.. చీఫ్ లిక్కర్ తాగేవాళ్లకే దాని గురించి తెలుసు.. కాబట్టే పదే పదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.. నిన్నటి బీజేపీ కార్యక్రమానికి జనాలకు పైసలు ఇచ్చి తెప్పించుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే రేఖా నాయక్.
Read Also: Girlfriend Attacks Boyfriend: సీన్ రివర్స్.. ప్రియుడ్ని బ్లేడ్ తో దాడిచేసిన ప్రియురాలు
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
రాత్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళలు వచ్చి పైసలు ఇవ్వలేదని ఆందోళన చేసిన వీడియో తన దగ్గర ఉందన్నారు ఎమ్మెల్యే రేఖా నాయక్.. తెలంగాణ సాధించుకున్నాకే రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.. అది కేసీఆర్ పాలనలో అభివృద్ధి కొనసాగుతుందని ప్రజలకు తెలుసు.. నువ్వే ఎన్ని జూట మాటలతో అరిచినా ప్రజలు ఎవ్వరు పట్టించుకోరన్నారు.. బండి సంజయ్ మీరు ఎంపీ కదా..? మరి ఏమయ్యాయి కేంద్ర ప్రభుత్వ నిధులు..? గిరిజన యూనివర్సిటీని ఎందుకు తెప్పించడంలేదు..? అని నిలదీశారు.. సోయం బాపురావు నోరు అదుపులో పెట్టుకో.. నీ గురించి ఇంద్రవెల్లి చౌరస్తా కాడికి వచ్చి కూడా మాట్లాడుతా అని సవాల్ చేశారు.. తప్పులు చేస్తేనే రాథోడ్ రమేష్.. నీ భార్యపై కేసు నమోదైంది.. అది గుర్తు పెట్టుకో.. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు ప్రజలకు ఏం అభివృద్ధి చేశావో చెప్పు అంటూ మండిపడ్డారు.. నీ కొడుకు రాథోడ్ రితేష్ అసిఫాబాద్ గిరిజనులు భూములు అక్రమంగా లాక్కున్నాడని ఆరోపించారు.. ఇక, రాజకీయాల్లోకి రాకముందే నాకు ఆస్తులున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మభ్య పెట్టె మాటలు చెబుతున్న బీజేపీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.. బీజేపీ నాయకులు నా గురించి గాని, టీఆర్ఎస్ గురించి గాని మాట్లాడితే బొందపెట్టి గోరి కడుతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్.
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!