Soyam Bapu Rao : మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాస్టర్లపై వ్యాఖ్యలు రాద్ధాంతం చేయొద్దని, మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం బాపురావు క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా క్రైస్తవులంటే నాకు ఎలాంటి ద్వేషం లేదని, అందరికంటే ఎక్కువగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను అయితే ఏజెన్సీ ప్రాంతాలలో అమాయక ఆదివాసీలను కొందరు పాస్టర్లు ప్రలోభ పరుచుకొని బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్నారన్నారు. ‘ఇంకో మతం వారు మా జాతి యువతులను మాయ మాటలతో లవ్ జిహాద్ ఉచ్చు లో దించుతున్నారు. దీంతో సనాతన సంస్కృతి , ఆదివాసీ ఆచారాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది ఇలాంటి అనైతిక చర్యల వాళ్ళ ఆదివాసీ జాతి మనుగడ ప్రశ్నర్ధకంగా మారడం నాకు బాధ కలిగించింది. రాంజీ గోండ్ , కొమురం భీం వారసులమైన మేము అంతరించి పోతున్న జాతి మనుగడ , అస్తిత్వం కోసం జాతిని కాపాడుకునేందుకు డెబ్భై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం.
Also Read : Kavach Technology : రైలు ప్రమాదాల నివారణకు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన కవాచ్ వ్యవస్థ ఏమైంది?
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో మతం మారిన ఆదివాసీలను ST జాబితా నుండి తొలగించి రిజర్వేషన్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేయడమే కాక తీర్మానం కూడా చేశాం. ఆదివాసీల సంస్కృతిని దెబ్బ కొట్టి బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్న ఒక ముఠా గురించే నేను మనోవేధనతో ఘాటుగా మాట్లాడి ప్రతీకార చర్యలతో బుల్లెట్ల మాదిరిగా ప్రతిఘటిస్తాం అని చెప్పడం జరిగింది. దీనిని క్రైస్తవ సోదరులు , సంఘాలు అపార్థం చేసుకోవడం శోచనీయం. బలవంతపు మత మార్పిడిలు చేస్తూ అమాయక గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్న కొందరు పాస్టర్ల తీరు గురించే నేను తీవ్రంగా స్పందించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. తప్పా క్రైస్తవ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కానే కాదు .
Also Read : Rail Accident: కోరమాండల్ రైలు ప్రమాదంలో 50దాటిన మృతుల సంఖ్య
ఏజెన్సీ ప్రాంతాలలో 5th షెడ్యూల్ ప్రకారం అన్యమత ప్రచారం రాజ్యాంగ విరుద్ధం. అయినా ఇంత కాలం మేము ఓపిక సహనం తోనే ఉన్నాం. బలవంతపు మత మార్పిడిలు ఆపివేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలం లో 1200 మంది అమాయక ఆదివాసులను బలవంతంగా మతమార్పిడి చేయడం మా దృష్టికి వచ్చింది. జాతి కోసం ఉద్యమాలు చేస్తున్న నన్ను కొందరు అనవసరంగా అకారణంగా విమర్శలు, ఆరోపణాల్తో రాద్ధాంతం చేయడం మానుకోండి. నన్ను కొందరు బెదిరించి హెచ్చరించడం అవివేకం. నా జాతి కోసం చావుకైనా సిద్ధమేనని గుర్తుంచుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాను. అన్ని మతాలు నా దృష్టిలో సమానమే . కొన్ని ముఠాల చర్యలను మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.’ అని సోయం బాపు రావు అన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!