Soyam Bapu Rao : మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం క్లారిటీ
పాస్టర్లపై వ్యాఖ్యలు రాద్ధాంతం చేయొద్దని, మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం బాపురావు క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా క్రైస్తవులంటే నాకు ఎలాంటి ద్వేషం లేదని, అందరికంటే ఎక్కువగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను అయితే ఏజెన్సీ ప్రాంతాలలో అమాయక ఆదివాసీలను కొందరు పాస్టర్లు ప్రలోభ పరుచుకొని బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్నారన్నారు. ‘ఇంకో మతం వారు మా జాతి యువతులను మాయ మాటలతో లవ్ జిహాద్ ఉచ్చు లో దించుతున్నారు. దీంతో సనాతన సంస్కృతి , ఆదివాసీ ఆచారాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది ఇలాంటి అనైతిక చర్యల వాళ్ళ ఆదివాసీ జాతి మనుగడ ప్రశ్నర్ధకంగా మారడం నాకు బాధ కలిగించింది. రాంజీ గోండ్ , కొమురం భీం వారసులమైన మేము అంతరించి పోతున్న జాతి మనుగడ , అస్తిత్వం కోసం జాతిని కాపాడుకునేందుకు డెబ్భై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం.
Also Read : Kavach Technology : రైలు ప్రమాదాల నివారణకు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన కవాచ్ వ్యవస్థ ఏమైంది?
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో మతం మారిన ఆదివాసీలను ST జాబితా నుండి తొలగించి రిజర్వేషన్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేయడమే కాక తీర్మానం కూడా చేశాం. ఆదివాసీల సంస్కృతిని దెబ్బ కొట్టి బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్న ఒక ముఠా గురించే నేను మనోవేధనతో ఘాటుగా మాట్లాడి ప్రతీకార చర్యలతో బుల్లెట్ల మాదిరిగా ప్రతిఘటిస్తాం అని చెప్పడం జరిగింది. దీనిని క్రైస్తవ సోదరులు , సంఘాలు అపార్థం చేసుకోవడం శోచనీయం. బలవంతపు మత మార్పిడిలు చేస్తూ అమాయక గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్న కొందరు పాస్టర్ల తీరు గురించే నేను తీవ్రంగా స్పందించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. తప్పా క్రైస్తవ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కానే కాదు .
Also Read : Rail Accident: కోరమాండల్ రైలు ప్రమాదంలో 50దాటిన మృతుల సంఖ్య
ఏజెన్సీ ప్రాంతాలలో 5th షెడ్యూల్ ప్రకారం అన్యమత ప్రచారం రాజ్యాంగ విరుద్ధం. అయినా ఇంత కాలం మేము ఓపిక సహనం తోనే ఉన్నాం. బలవంతపు మత మార్పిడిలు ఆపివేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలం లో 1200 మంది అమాయక ఆదివాసులను బలవంతంగా మతమార్పిడి చేయడం మా దృష్టికి వచ్చింది. జాతి కోసం ఉద్యమాలు చేస్తున్న నన్ను కొందరు అనవసరంగా అకారణంగా విమర్శలు, ఆరోపణాల్తో రాద్ధాంతం చేయడం మానుకోండి. నన్ను కొందరు బెదిరించి హెచ్చరించడం అవివేకం. నా జాతి కోసం చావుకైనా సిద్ధమేనని గుర్తుంచుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాను. అన్ని మతాలు నా దృష్టిలో సమానమే . కొన్ని ముఠాల చర్యలను మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.’ అని సోయం బాపు రావు అన్నారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!