Soyam Bapu Rao : మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాస్టర్లపై వ్యాఖ్యలు రాద్ధాంతం చేయొద్దని, మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతా అనే వ్యాఖ్యలపై ఎంపీ సోయం బాపురావు క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా క్రైస్తవులంటే నాకు ఎలాంటి ద్వేషం లేదని, అందరికంటే ఎక్కువగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను అయితే ఏజెన్సీ ప్రాంతాలలో అమాయక ఆదివాసీలను కొందరు పాస్టర్లు ప్రలోభ పరుచుకొని బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్నారన్నారు. ‘ఇంకో మతం వారు మా జాతి యువతులను మాయ మాటలతో లవ్ జిహాద్ ఉచ్చు లో దించుతున్నారు. దీంతో సనాతన సంస్కృతి , ఆదివాసీ ఆచారాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది ఇలాంటి అనైతిక చర్యల వాళ్ళ ఆదివాసీ జాతి మనుగడ ప్రశ్నర్ధకంగా మారడం నాకు బాధ కలిగించింది. రాంజీ గోండ్ , కొమురం భీం వారసులమైన మేము అంతరించి పోతున్న జాతి మనుగడ , అస్తిత్వం కోసం జాతిని కాపాడుకునేందుకు డెబ్భై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం.
Also Read : Kavach Technology : రైలు ప్రమాదాల నివారణకు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన కవాచ్ వ్యవస్థ ఏమైంది?
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో మతం మారిన ఆదివాసీలను ST జాబితా నుండి తొలగించి రిజర్వేషన్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేయడమే కాక తీర్మానం కూడా చేశాం. ఆదివాసీల సంస్కృతిని దెబ్బ కొట్టి బలవంతపు మాత మార్పిడిలు చేస్తున్న ఒక ముఠా గురించే నేను మనోవేధనతో ఘాటుగా మాట్లాడి ప్రతీకార చర్యలతో బుల్లెట్ల మాదిరిగా ప్రతిఘటిస్తాం అని చెప్పడం జరిగింది. దీనిని క్రైస్తవ సోదరులు , సంఘాలు అపార్థం చేసుకోవడం శోచనీయం. బలవంతపు మత మార్పిడిలు చేస్తూ అమాయక గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్న కొందరు పాస్టర్ల తీరు గురించే నేను తీవ్రంగా స్పందించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. తప్పా క్రైస్తవ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కానే కాదు .
Also Read : Rail Accident: కోరమాండల్ రైలు ప్రమాదంలో 50దాటిన మృతుల సంఖ్య
ఏజెన్సీ ప్రాంతాలలో 5th షెడ్యూల్ ప్రకారం అన్యమత ప్రచారం రాజ్యాంగ విరుద్ధం. అయినా ఇంత కాలం మేము ఓపిక సహనం తోనే ఉన్నాం. బలవంతపు మత మార్పిడిలు ఆపివేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలం లో 1200 మంది అమాయక ఆదివాసులను బలవంతంగా మతమార్పిడి చేయడం మా దృష్టికి వచ్చింది. జాతి కోసం ఉద్యమాలు చేస్తున్న నన్ను కొందరు అనవసరంగా అకారణంగా విమర్శలు, ఆరోపణాల్తో రాద్ధాంతం చేయడం మానుకోండి. నన్ను కొందరు బెదిరించి హెచ్చరించడం అవివేకం. నా జాతి కోసం చావుకైనా సిద్ధమేనని గుర్తుంచుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాను. అన్ని మతాలు నా దృష్టిలో సమానమే . కొన్ని ముఠాల చర్యలను మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.’ అని సోయం బాపు రావు అన్నారు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!