పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్కి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండవ సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కివీస్ జట్టు ఫైనల్కు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ భారత్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 362 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 312 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తనను తాను టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు వేశాడు. ఆయన చెప్పిన మాటలపై ఇంటర్నెట్లో చర్చ జరుగుతోంది. టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన కొన్ని తేదీలను సైతం ప్రస్తావించారు.
యూపీలోని డియోరియాలో మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగంపై బెల్టుతో కొట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడిని సోఫాలో బోర్ల పడుకోబెట్టారు.
Cyber Crime Voice: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలు పెరుగుతూ ప్రజలను మోసం చేసి వారి డబ్బును కాజేయడం చూస్తూనే ఉన్నాం. మీరు లక్కీ డ్రాలో గెలిచారు.., మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి, అద్భుతమైన ఆఫర్ మీ కోసం.. అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, మోసాలు తగ్గడం లేదు. ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో…
ఏపీలో ఫిబ్రవరి 23న (ఆదివారం) జరిగే గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది.
Megastar : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తను కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టారు.
Bharat Jodo Vivah: భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఈ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా భారత్ జోడో వివాహం జరిగింది. భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది ఓ యువ జంట.
టీమిండియా జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు.