విజయనగరం జిల్లాలో ఓ హెచ్ఎం విద్యార్థులకు స్టేజ్ పై నుంచి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి.. క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులు, పాములు వంటి వాటి వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. పాముల పేరు వినగానే చాలామంది భయంతో వణికిపోతారు. మరికొందరు అవి ఉన్న దరిదాపుల్లో కూడా ఉండటానికి భయపడతారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వక తప్పదు. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులు చనిపోయిన ఒక పెద్ద కొండ చిలువను తాడులా పట్టుకుని,…
Viral Video: సామాజిక మాధ్యమాల్లో తరచూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పుణే నగరానికి చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపిస్తూ రూపొందించిన ఒక చిన్న వీడియో తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేసింది. సామాన్య వస్తువులను వినియోగించి సూపర్ బీట్లను తయారు చేసిన తీరు ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేశారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ వీడియో నెత్తిన తెగ వైరల్ అవుతోంది. Read…
మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క సినిమాలు బిజీ బిజీగా చేస్తూనే మరో పక్క పర్సనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాక నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀…
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్కి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండవ సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కివీస్ జట్టు ఫైనల్కు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ భారత్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 362 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 312 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తనను తాను టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు వేశాడు. ఆయన చెప్పిన మాటలపై ఇంటర్నెట్లో చర్చ జరుగుతోంది. టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన కొన్ని తేదీలను సైతం ప్రస్తావించారు.
యూపీలోని డియోరియాలో మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగంపై బెల్టుతో కొట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడిని సోఫాలో బోర్ల పడుకోబెట్టారు.
Cyber Crime Voice: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలు పెరుగుతూ ప్రజలను మోసం చేసి వారి డబ్బును కాజేయడం చూస్తూనే ఉన్నాం. మీరు లక్కీ డ్రాలో గెలిచారు.., మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి, అద్భుతమైన ఆఫర్ మీ కోసం.. అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, మోసాలు తగ్గడం లేదు. ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో…