31 From Karnataka Stuck In Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడి సైన్యం, పారామిటిలరీ మధ్య తీవ్రం ఘర్షణ ఏర్పడింది. ఈ రెండు దళాల అధిపతుల మధ్య తీవ్ర ఘర్షణ దేశాన్ని, అక్కడి ప్రజలు ప్రమాదంలోకి నెట్టింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రాజధాని ఖార్టూమ్ లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఘర్షణల్లో 200 మంది మరణించాగా.. 1800 మంది గాయపడ్డారు. సూడాన్…
కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. టికెట్లుపై ఆశ పడి భంగపడిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీని వీడారు.
Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేవిధంగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న 189 మంది అభ్యర్థులతో తొలివిడత జాబితాను విడుదల చేసింది. దీంతో 52 మంది కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు, బలమైన అభ్యర్థులను చూసి పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు అభ్యర్థుల ఎంపిక, మరోవైపు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ సారి ఎన్నికల్లో అధికారం చేపట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. బీజేపీ వైఫల్యాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Karnataka Elections: కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పోరాటం ప్రారంభం అయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, మరోసారి అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు జేడీఎస్ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకుని బస్సు యాత్రను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనుంది. రేపు బెలగావిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
కర్ణాటకలో వచ్చే ఏప్రిల్/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది.
Karnataka Politics: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ నేతలను కుక్కపిల్లలంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ముందు వీరంతా కుక్కపిల్లలని.. మోదీని చూస్తే వణికిపోతారంటూ విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కర్ణాటకకు స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా ఆర్థిక మంత్రి సీతారామన్ ఇవ్వలేదని సిద్దరామయ్య విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ కోసమే తప్ప, ఇది సామాన్య ప్రజలను ఉద్దేశించినది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం అన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కర్ణాటకలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలో అడుగుపెట్టిన రాహుల్గాంధీకి రాష్ట్ర సరిహద్దులోని గుండ్లుపేట్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.