Karnataka Elections: బీజేపీ మాస్టర్ ప్లాన్.. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు చెక్ పెట్టేలా స్కెచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేవిధంగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న 189 మంది అభ్యర్థులతో తొలివిడత జాబితాను విడుదల చేసింది. దీంతో 52 మంది కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు, బలమైన అభ్యర్థులను చూసి పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ ఎవరిని పోటీలో నిలబెడుతుందా..? అనేది సర్వత్రా ఆసక్తిని పెంచింది. అయితే వీరిద్దరిపై బీజేపీలో బలమైన నేతలుగా ఉన్న ఆర్ అశోక్, వీ సోమన్నలను నిలబెడుతోంది. వీరిద్దరు దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కనక్ పురా, వరుణ నుంచి పోటీలో నిలబడుతూనే, వారి సొంత నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేతలు పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. అయితే వీరి పోటీతో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో బీజేపీ శ్రేణులు బలపడగాయని, పార్టీ పనితీరు మెరుగుపడుతుందని బీజేపీ భావిస్తోంది.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Also: Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. టాప్లో జగన్ మోహన్ రెడ్డి
వొక్కలిగ వర్గానికి చెందిన కీలక నాయకుడిగా అశోక్ ఉండగా, లింగాయత్ వర్గానికి చెందిన సోమన్న, ఇద్దరూ తమ కమ్యూనిటీలో బలమైన నేతలుగా ఉన్నారు. ఈ రెండు స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ తన వనరులన్నింటిని ఉపయోగించాలని అనుకుంటోంది. ఇద్దరు అభ్యర్థులు బాగా పనిచేస్తే వారి కుటుంబాలకు సీట్లు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వీరిద్దరిని డీకే శివకుమార్-కనక్ పురా, సిద్ధరామయ్య-వరుణ స్థానాల నుంచి పోటీలో నిలబెడితే వీరిని ఆ నియోజకవర్గాలకు మాత్రమే కట్టడి చేయొచ్చని, కర్ణాటక మొత్తం ప్రచారం చేసే అవకాశం లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది.
ఇక బీజేపీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కూడా బీజేపీ బాగా ఉపయోగించుకుంటోంది. అభ్యర్థుల ఎంపికలో ఆయన ముద్ర కనిపిస్తోంది. బీజేపీ ఫస్ట్ లిస్టులో 50 మంది యడియూరప్ప లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారు. మరో 40 మంది వొక్కలిగ వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక యడియూరప్ప స్థానం అయిన షికారిపుర నుంచి ఆయన కొడుకు బీవై విజయేంద్రకు పోటీలో నిలబ్డడారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!