Karnataka Elections: బీజేపీ మాస్టర్ ప్లాన్.. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు చెక్ పెట్టేలా స్కెచ్..
Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేవిధంగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న 189 మంది అభ్యర్థులతో తొలివిడత జాబితాను విడుదల చేసింది. దీంతో 52 మంది కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు, బలమైన అభ్యర్థులను చూసి పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ ఎవరిని పోటీలో నిలబెడుతుందా..? అనేది సర్వత్రా ఆసక్తిని పెంచింది. అయితే వీరిద్దరిపై బీజేపీలో బలమైన నేతలుగా ఉన్న ఆర్ అశోక్, వీ సోమన్నలను నిలబెడుతోంది. వీరిద్దరు దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కనక్ పురా, వరుణ నుంచి పోటీలో నిలబడుతూనే, వారి సొంత నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేతలు పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. అయితే వీరి పోటీతో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో బీజేపీ శ్రేణులు బలపడగాయని, పార్టీ పనితీరు మెరుగుపడుతుందని బీజేపీ భావిస్తోంది.
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
Read Also: Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. టాప్లో జగన్ మోహన్ రెడ్డి
వొక్కలిగ వర్గానికి చెందిన కీలక నాయకుడిగా అశోక్ ఉండగా, లింగాయత్ వర్గానికి చెందిన సోమన్న, ఇద్దరూ తమ కమ్యూనిటీలో బలమైన నేతలుగా ఉన్నారు. ఈ రెండు స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ తన వనరులన్నింటిని ఉపయోగించాలని అనుకుంటోంది. ఇద్దరు అభ్యర్థులు బాగా పనిచేస్తే వారి కుటుంబాలకు సీట్లు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వీరిద్దరిని డీకే శివకుమార్-కనక్ పురా, సిద్ధరామయ్య-వరుణ స్థానాల నుంచి పోటీలో నిలబెడితే వీరిని ఆ నియోజకవర్గాలకు మాత్రమే కట్టడి చేయొచ్చని, కర్ణాటక మొత్తం ప్రచారం చేసే అవకాశం లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది.
ఇక బీజేపీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కూడా బీజేపీ బాగా ఉపయోగించుకుంటోంది. అభ్యర్థుల ఎంపికలో ఆయన ముద్ర కనిపిస్తోంది. బీజేపీ ఫస్ట్ లిస్టులో 50 మంది యడియూరప్ప లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారు. మరో 40 మంది వొక్కలిగ వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక యడియూరప్ప స్థానం అయిన షికారిపుర నుంచి ఆయన కొడుకు బీవై విజయేంద్రకు పోటీలో నిలబ్డడారు.
తాజావార్తలు
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్గా ‘కేరళ’ కింగ్!
-
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
-
Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
-
Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?
-
Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!