Karnataka Election: లింగాయత్లపై సిద్ధరామయ్య ‘సెల్ఫ్ గోల్’.. కర్ణాటకలో బీజేపీకి దెబ్బ తగులుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ‘అవినీతి రహిత లింగాయత్ ముఖ్యమంత్రి’ అంటూ బసవరాజ్ బొమ్మైపై దుమ్మెత్తిపోయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేపింది. ఇది లింగాయత్ ఓట్ల శాతంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో అనే అంశంపై చర్చ మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు ప్రముఖ లింగాయత్ నేతలు జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవాది బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడంతో కాషాయ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు కీలక నేతల చేరికతో కాంగ్రెస్ ను కలిసి వస్తుందని భావిస్తోంది. ‘లింగాయత్ సిఎం అభ్యర్థి’ని పేర్కొనడానికి బిజెపి ఆలోచనిస్తోంది. ఈ విషయంలో సిద్ధరామయ్య ప్రత్యేకంగా స్పందించారు. ఇప్పటికే లింగాయత్ సిఎం (బసవరాజ్ బొమ్మై) ఉన్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అంతటికీ ఆయనే కారణం. నీకు ఇంకా కావాలా?” అంటూ వ్యాఖ్యానించారు. ఇది మొత్తం లింగాయత్ కమ్యూనిటీపై దాడి, అవమానం అని వ్యాఖ్యానిస్తూ, బిజెపి నాయకులు సిద్ధరామయ్యపై విమర్శలు గుప్పించారు. లింగాయత్ వర్గాలను చీల్చేందుకు ప్రయత్నించిన సిద్ధరామయ్యకు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
Also Read:Vande Bharat Express: కేరళ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం
ముఖ్యమంత్రి బొమ్మై మాట్లాడుతూ, మోడీలందరినీ దొంగలుగా అభివర్ణించిన తన నాయకుడు రాహుల్ గాంధీ మాదిరిగానే సిద్ధరామయ్య మాట్లాడారని అన్నారు. తన అవమానకర వ్యాఖ్యకు సిద్ధరామయ్య త్వరలోనే మూల్యం చెల్లించుకోనున్నారని విమర్శించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 17 శాతం ఉన్న లింగాయత్లు ఉన్నారు. ఎన్నికల్లో వారి ఓట్లే చాలా కీలకం. మొత్తం 224 సీట్లలో కనీసం 130 సీట్లలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నందున, లింగాయత్ ఓట్ల కోసం యుద్ధం తీవ్రమైంది. పార్టీ టిక్కెట్లు నిరాకరించడంతో సవాది, షెట్టర్ వరుసగా బిజెపిని విడిచిపెట్టి, కాంగ్రెస్లో చేరిన తర్వాత, రెండు పక్షాలు ఒకరిపై ఒకరు వాగ్వివాదానికి దిగారు. 1990వ దశకం చివరలో లింగాయత్లకు నాయకుడిగా BS యడియూరప్ప ఆవిర్భవించినప్పటి నుండి రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి ఆ వర్గాల సంపూర్ణ మద్దతును పొందింది. కాలక్రమేణా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలలో కాంగ్రెస్ తన మద్దతులో స్థిరమైన క్షీణతను చూసింది.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
ఇతర వెనుకబడిన తరగతులు, రాష్ట్రంలో రెండవ అతిపెద్ద కమ్యూనిటీ అయిన వొక్కలిగలు, హెచ్డి దేవెగౌడను మద్దతుగా నిలిచారు. మైనారిటీలతో పాటు కురుబలు, బలిజలు, రెడ్డిల వంటి OBC వర్గాలు కూడా కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడానికి మరిన్ని వర్గాల మద్దతు కాంగ్రెస్తోనే ఉన్నాయి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కెపిసిసి అధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్కు భారీ విజయాన్ని అందించారు. కానీ, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ఆయనకు స్ట్రోక్ రావడంతో ఆయనను మార్చాల్సి వచ్చింది. అయితే విమానాశ్రయంలో పాటిల్ను తొలగిస్తున్నట్లు అప్పటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్గాంధీ ప్రకటించడంతో ఆయన తొలగింపు తీరు సీనియర్ నేతకు అవమానంగా అనిపించింది. ఆ తర్వాత లింగాయత్ల ఎదురుదెబ్బ నుంచి కాంగ్రెస్ కోలుకోలేదు. శెట్టర్, సవాడి చేరికతో కాంగ్రెస్ నేతలు లింగాయత్లతో సయోధ్య కుదుర్చుకుని వారి మద్దతును తిరిగి పొందాలని ఆశిస్తున్నారు.
Also Read:Payal Rajput: ఆ సీతాకోక చిలుక ఎంత బాగుందో…
పార్టీ 56 వొక్కలిగాలకు వ్యతిరేకంగా 47 మంది లింగాయత్ అభ్యర్థులను నిలబెట్టింది. వీరశైవ-లింగాయత్ మహాసభ అధ్యక్షుడు, దావణగెరె నుండి పార్టీ అభ్యర్థి 92 ఏళ్ల షామనూరు శివశంకరప్ప గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎన్నికైతే ‘లింగాయత్ సిఎం’ కోసం ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సీఎం పదవిని ఆశించే వారిలో ఒకరైన ఎంబీ పాటిల్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన శాసనసభా పక్షం అభిప్రాయం ఆధారంగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. కానీ, మా పనితీరు, సంఘం యొక్క సహకారం ఆధారంగా పార్టీ తమకు ప్రతిఫలమిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కానీ, ఈసారి 62 లింగాయత్లు, 42 వొక్కలిగలను పోటీకి దింపిన బిజెపి.. షెట్టర్, సవాదిల ప్రభావం అంతంత మాత్రమే అని నమ్మకంగా ఉంది. పార్టీకి ద్రోహం చేసిన శెట్టర్, సవాడి నియోజకవర్గాలలో పర్యటించి వారి ఓడించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాజీ సీఎం యడ్యూరప్పను కోరారు. మూడు రోజుల క్రితం, యడియూరప్ప తన నివాసంలో 30 మంది ప్రముఖ లింగాయత్ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిజెపి అభ్యర్థులను ఎన్నుకునే అంశంపైనే చర్చలు జరిపారి తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!