Stuck In Sudan: సూడాన్లో చిక్కుకున్న భారతీయులు.. 31 మంది కన్నడిగులు సురక్షితమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూడాన్లో దేశ సైన్యం, పారామిలిటరీల మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. ఈ పోరులో దాదాపు 200 మంది మరణించారు. సుమారు 1,800 మంది గాయపడ్డారు. అయితే, కర్ణాటక నుండి వెళ్లిన 31 మంది వ్యక్తులు సూడాన్లో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. రెస్క్యూ ప్రక్రియను వేగవంతం చేయడానికి సూడాన్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కర్ణాటకకు చెందిన 31 మంది వ్యక్తుల బృందం సూడాన్లో చిక్కుకుపోయినట్లు మాకు సందేశం వచ్చిందని కెఎస్డిఎంఎ కమిషనర్ డాక్టర్ మనోజ్ రాజన్ తెలిపారు. తాము ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పుడు చిక్కుకుపోయిన వారు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి, బయటికి వెళ్లకూడదని హెచ్చరించినట్లు వెల్లడించారు.
Also Read:Revanth reddy: ఏ శాఖలో ఎన్నిఖాళీలున్నాయో 24గంటల్లోగా చెప్పు బండి సంజయ్
సూడాన్ లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలని కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు సురక్షితంగా తిరిగి భారత్ వచ్చేలా చూడాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. కర్ణాటకకు చెందిన హక్కీ పిక్కీ తెగకు చెందిన 31 మంది అంతర్యుద్ధంతో ఇబ్బంది పడుతున్న సూడాన్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. సూడాన్లోని హక్కీ పిక్కిలు గత కొన్ని రోజులుగా ఆహారం లేకుండా ఒంటరిగా ఉన్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇంకా చర్యను ప్రారంభించలేదు. ప్రభుత్వం తక్షణమే దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని, హక్కీ పిక్కిల శ్రేయస్సును నిర్ధారించడానికి అంతర్జాతీయ ఏజెన్సీలను సంప్రదించాలని సిద్ధరామయ్య కేంద్రాన్ని కోరారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
It is reported that 31 people from Karnataka belonging to Hakki Pikki tribe, are stranded in Sudan which is troubled by civil war.
I urge @PMOIndia @narendramodi, @HMOIndia, @MEAIndia and @BSBommai to immediately intervene & ensure their safe return.
— Siddaramaiah (@siddaramaiah) April 18, 2023
సూడాన్లో పనిచేస్తున్న భారతీయుడు ఆదివారం బుల్లెట్ గాయంతో మరణించాడు. సూడాన్లో హింస చెలరేగిన వెంటనే, భారత రాయబార కార్యాలయం సోమవారం భారతీయులు తమ నివాసాల నుండి బయటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. 2021లో సైనిక తిరుగుబాటు తరువాత దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఇద్దరు జనరల్స్ మధ్య వారాలపాటు సాగిన అధికార పోరాటం ముగిసిన తర్వాత శనివారం, సూడాన్ పేలుళ్లు, తుపాకీ కాల్పులతో ఉలిక్కి పడింది. ఇద్దరు జనరల్స్ – సూడాన్ సైన్యానికి అధిపతి అయిన అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మాజీ మిత్రులు. 2019లో సుడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ను పడగొట్టడానికి ఇద్దరూ కలిసి పనిచేశారు. 2021 సైనిక తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. అయితే, దేశంలో పౌర పాలనను పునరుద్ధరించే ప్రణాళికల్లో భాగంగా సుడాన్ సైన్యంలో ఆర్ఎస్ఎఫ్ని ఏకీకృతం చేయడానికి చర్చలు కొత్త పాలనలో ఎవరు ఎవరిని ఆదేశిస్తారనే ప్రశ్నలు తలెత్తినప్పుడు ప్రతికూలంగా మారాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!